చిరంజీవికి ఆ హీరోయిన్ తో ఎఫైర్ నడిచిందా… ఆ విషయం బాలయ్యకు కూడా తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు అగ్ర హీరోలు ఒకే వేదికపై కనిపించడం చాలా అరుదు ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి సన్నివేశాలను చూడడం ఎప్పుడో ఒకసారి మాత్రమే జరుగుతుంది. ఇద్దరి అగ్ర హీరోల సినిమాలు ఒకేసారి విడుదలై థియేటర్లలో అభిమానుల కోలాహలం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ అగ్ర హీరోలైన చిరంజీవి బాలకృష్ణ మరోసారి బాక్సాఫీస్ వద్ద తలబడనున్నారు.వచ్చే సంక్రాంతికి ఈ ఇద్దరు తమ సినిమాలతో పోటీ పడుతున్నారు. వాల్తేరు వీరయ్య వర్సెస్ వీరసింహారెడ్డి సినిమాల్లో ఎవరి సినిమా పై చేయి సాధిస్తుందో అన్న ఆసక్తి అభిమానులు తీవ్ర చర్చకు దారితీస్తుంది.

బాలయ్య ఆహా ఓటీటీలో చేస్తోన్న అన్‌స్టాపబుల్‌కు
టాక్ షో ద్వారా బుల్లితెరపై చేస్తున్న హంగామా అంతా ఇంత కాదు.అన్‌స్టాపబుల్‌ రెండో సీజన్లో కూడా ఐదు ఎపిసోడ్లు పూర్తయ్యాయి.కిరణ్‌కుమార్‌రెడ్డి,సురేష్‌రెడ్డి, రాధిక ఎపిసోడ్ మినహా అన్ని బాగా క్లిక్ అయ్యాయి. ఇద్దరు నిర్మాతలు, ఇద్దరు దర్శకులు ఎపిసోడ్ బాగా పేలింది. అయితే ఇప్పుడు చిరంజీవి అన్‌స్టాపబుల్‌ రెండు సీజన్లో గెస్టుగా వస్తున్నాడంటూ ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంపై చిరంజీవి అధికారిక ప్రకటన అంటూ ఏమీ లేదు. ఒకవేళ చిరంజీవి ఈ ప్రోగ్రాం చేయడానికి ఒప్పుకుంటే బాలయ్యను చిరంజీవిని ఒకే వేదికపై చూసే అరుదైన సన్నివేశాన్ని మనం చూడొచ్చు అలాగే బాలకృష్ణ చిరంజీవి పై సంధించే చిలిపి ప్రశ్నలు ఎలా ఉంటాయో అన్న ఆసక్తి ఇరువురి అభిమానుల్లో నెలకొంది.

ఒకవేళ చిరంజీవి అన్‌స్టాపబుల్‌ షో కు రావడానికి ఒప్పుకుంటే బాలకృష్ణ మొహమాటం లేకుండా
నీకుఆ హీరోయిన్‌తో ఎఫైర్ ఉంది కదా ? ఆ కథ ఏంటో చెప్పు ?,నరసింహానాయుడుతో పోటీపడినప్పుడు మృగరాజు ప్లాప్ అయ్యింది.. ఆ సినిమా పోయినప్పుడు లోపల బాధపడ్డావట కదా ?, నెల్లూరు పొలాల్లో హెలిపాడ్ కూలిపోయినప్పుడు భయపడి గట్టిగా ఏడ్చేశావా,అప్పుడు ఏమనినిపించింది ? వంటి చిలిపి ప్రశ్నలు వేసే ఛాన్స్ ఉందనే చర్చలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. బాలకృష్ణ అడిగే చిలిపి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడడం కంటే షో కు వెళ్లకుండా ఉండడమే మంచిదన్న అభిప్రాయంలో చిరంజీవి ఉన్నాడంటూ ప్రచారం సాగుతోంది. ఏది ఏమైనా వీరిద్దరూ కలిసి నటిస్తే చూడాలన్న కోరిక తీరకపోయినా ఇలా ఈ షోలో ఇద్దరూ కలిసి నవ్వులు పండిస్తే చూడాలన్న ఆశ తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికే ఉండి ఉంటుంది.