ఐపీఎల్ 2025 సీజన్లో మరో హై వోల్టేజ్ థ్రిల్లర్ మ్యాచ్ జరిగింది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో దిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. 188 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో రాజస్థాన్ కూడా అదే స్కోరు చేయడంతో మ్యాచ్ టై అయ్యింది. దీంతో నిర్ణయం కోసం సూపర్ ఓవర్కు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ దిల్లీ నాలుగు బంతుల్లోనే విజయ లక్ష్యాన్ని ఛేదించి మెమోరబుల్ గెలుపు అందుకుంది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన దిల్లీ, 20 ఓవర్లలో 188 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ పోరెల్ (49), కెఎల్ రాహుల్ (38), స్టబ్స్ (34), అక్షర్ పటేల్ (14)లు మంచి ఇన్నింగ్స్తో జట్టుకు దూకుడు ఇచ్చారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు తీయగా, హసరంగ, తీక్షణ ఒక్కో వికెట్ పడగొట్టారు. దీంతో రాజస్థాన్కు 189 పరుగుల టార్గెట్ నిలిచింది.
లక్ష్య ఛేదనలో యశస్వి జైశ్వాల్ (51) – సంజూ శాంసన్ (31) జోడీ మంచి శుభారంభం అందించింది. శాంసన్ రిటైర్డ్ హర్ట్ అయినా, తర్వాత వచ్చిన నితీశ్ రాణా (51) ధాటిగా ఆడి జైశ్వాల్తో కలిసి జట్టును ముందుకు నడిపించాడు. కానీ జైశ్వాల్, రాణా ఔటైన తర్వాత రాజస్థాన్ జట్టుకు జోరు తగ్గింది. చివరి బంతికి కేవలం 2 పరుగులు అవసరమైన సమయంలో రెండో రన్ తీసే ప్రయత్నంలో జురైల్ రనౌట్ కావడంతో మ్యాచ్ టై అయింది. స్టార్క్ అద్భుతమైన బౌలింగ్ తో మ్యాచ్ ను మలుపు తిప్పాడు.
సూపర్ ఓవర్లో మొదట రాజస్థాన్ బ్యాటింగ్ చేసింది. హెట్మయర్, పరాగ్, జైశ్వాల్ ముగ్గురు కలిసి… కేవలం 11 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయారు. దిల్లీ తరఫున స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అనంతరం దిల్లీ టార్గెట్ ఛేదనలో కేఎల్ రాహుల్ రెండు బంతుల్లో 6 పరుగులు చేశాడు. మూడో బంతికి సింగిల్ తీసి స్టబ్స్కు స్ట్రైక్ ఇచ్చాడు. స్టబ్స్ నాలుగో బంతికి భారీ సిక్స్ కొట్టి దిల్లీకి విజయం అందించాడు. ఈ గేమ్ మరోసారి ఐపీఎల్లో సూపర్ ఓవర్ల మజాను రిపీట్ చేసింది. చివరి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్లో రాజస్థాన్ చివరి ఓవర్ దశలోే గెలుపు కోల్పోయింది.