క్రేజీ : కమల్, మణిరత్నం సినిమాలోకి వైష్ణవ్ తేజ్ విలన్..!

ఇండియన్ సినిమా దగ్గర ఉన్న పలు క్రేజీ కాంబినేషన్ లలో ఉలగనయగన్ కమల్ హాసన్ అలాగే లెజెండరీ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్ కూడా ఒకటి. ఈ కాంబినేషన్ సౌత్ లోనే కాకుండా ఇండియన్ సినిమా దగ్గర కూడా మంచి మార్క్ ఈ కాంబినేషన్ పై ఉంది.

వీరి నుంచి వచ్చిన “నాయగన్” సినిమా ఇప్పటికీ ఎప్పటికీ ఒక బెంచ్ మార్క్ సినిమా కాగా ఇప్పుడు మళ్ళీ ఎన్నో ఏళ్ల తర్వాత ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ని ఇప్పుడు చేస్తున్నారు. కాగా ఈ సినిమా ఇంట్రెస్టింగ్ గా ఒక ఏక్షన్ ప్రాజెక్ట్ గా అయితే దీనిని అనౌన్స్ చేసి ఊహించని ట్రీట్ ని అయితే అందించారు.

కాగా ఈ చిత్రంలో ఇప్పుడు వెరీ టాలెంటెడ్ మలయాళ నటుడు జోజు జార్జ్ నటిస్తున్నట్టుగా మేకర్స్ క్రేజీ అప్డేట్ అందించారు. అలాగే తనతో పాటుగా నటుడు గౌతమ్ కార్తీక్ కూడా నటిస్తున్నట్టుగా తెలిపారు. మరి జోజు జార్జ్ రీసెంట్ గానే మన తెలుగులో యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం “ఆదికేశవ” లో విలన్ గా నటించి డెబ్యూ ఇచ్చాడు.

మరి మలయాళంలో ఒక వెర్సటైల్ నటుడుగా కూడా తనకి ఎంతో గొప్ప పేరు ఉంది. ఇక ఇప్పుడు విలక్షణ నటుడు కమల్ హాసన్ ఇంకా దిగ్గజ దర్శకుడు మణిరత్నం లాంటి కాంబినేషన్ లో కనిపించడం అనేది చాలా ఆసక్తిగా మారింది అని చెప్పాలి. మరి ఈ సెన్సేషనల్ కలయికలో వచ్చే ఈ చిత్రం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. కాగా ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే కమల్ హాసన్, రెడ్ జెయింట్ ఫిల్మ్స్  మరియు మద్రాస్ టాకీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.