ఎన్టీఆర్ “దేవర” కథపై క్రేజీ రూమర్.!

గత ఏడాది టాలీవుడ్ నుంచి వచ్చి గ్లోబల్ ఫినామినాగా నిలిచిన భారీ సక్సెస్ ఫుల్ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ భారీ చిత్రం తర్వాత హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు ఇద్దరూ కూడా గ్లోబల్ స్టార్స్ అయితే అయిపోయారు.

ఇక ఈ సినిమా తర్వాత ఇద్దరు కూడా తమ భారీ చిత్రాలతో బిజీగా ఉండగా వాటిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న సెన్సేషనల్ పాన్ ఇండియా సినిమానే “దేవర”. దర్శకుడు కొరటాల శివ భారీ హంగులతో చేస్తున్న మొదటి పాన్ ఇండియా సబ్జెక్టు కూడా ఇదే కావడంతో హైప్ నెక్స్ట్ లెవెల్లో కూడా ఉంది.

అయితే దేవర సినిమా కథపై ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ రూమర్ అయితే వైరల్ గా మారింది. ఈ చిత్రం ఆంధ్ర ప్రదేశ్ బాపట్ల ప్రాంతంలో కొందరు దళితులపై ఓ అగ్ర కుల సమూహం చేసిన పాశవిక దాడి వందలాది మంది దళిత కుటుంబాలని రోడ్డున పడేయడం అంశంతో పలు నిజ జీవిత సంఘటనలు 1985 టైం లో జరిగిన వాటిపై తీస్తున్నారు అని రూమర్స్ వినిపిస్తున్నాయి.

అలాంటి క్రూరులని ఎదుర్కొన్న ఆ ఒక్కడి కథ ఆ దేవర కథ అని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు అలాగే అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.