Mahesh Voice Over For Acharya : కన్ఫర్మ్ : “ఆచార్య” కి మహేష్ బాబు.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసిన చిరంజీవి.!

Mahesh Voice Over For Acharya

Mahesh Voice Over For Acharya : గత రెండు రోజులు నుంచి కూడా సినీ వర్గాల్లో మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి మోస్ట్ అవైటెడ్ సినిమా “ఆచార్య” కి గాను సూపర్ స్టార్ మహేష్ బాబు తన గొంతుని అందించాడని వార్తలు వింటూనే ఉన్నాము. అయితే ఇది దాదాపు నిజమే అని కన్ఫర్మ్ అవ్వగా ఇప్పుడు దీనిపై అధికారిక క్లారిటీని ఏకంగా మెగాస్టార్ చిరంజీవినే ఇవ్వడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.

ఈ తన “ఆచార్య” సినిమాకి మహేష్ బాబు తన గొంతు ఇవ్వడం జరిగింది అని అలాగే దానికి చాలా సంతోషంగా ఉందని తాను తెలిపాడు. అలాగే ఈ సినిమాలో పద ఘట్టాన్ని మహేష్ స్టార్ట్ చేస్తాడని ఖచ్చితంగా అభిమానులు మరియు ప్రేక్షకులు ఈ సినిమాలో మహేష్ వాయిస్ ఓవర్ విని థ్రిల్ అవుతారని..

నేను మరియు రామ్ చరణ్ లు కూడా మహేష్ వాయిస్ విని థ్రిల్ అయ్యాము అలాగే మీరు అంతా కూడా అవుతారని తెలుపుతూ మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసారు. దీనితో ఇది మహేష్ మరియు మెగా ఫ్యాన్స్ లో ఆసక్తిగా మారిపోయింది. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మరియు పూజా హెగ్డే లు హీరోయిన్స్ గా నటించగా మణిశర్మ సంగీతం అందించారు. అలాగే మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ మరియు కొణిదెల ప్రొడక్షన్ వాళ్ళు కలిసి ఈ సినిమాని నిర్మాణం చేశారు.