Radhe Shyam: రాధేశ్యామ్ చిత్రానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ వరుస ట్వీట్స్ చేస్తున్న సినీ సెలబ్రిటీలు!

Radhe Shyam: పాన్ ఇండియా హీరో ప్రభాస్ పూజాహెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్.ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా పలు సార్లు వాయిదా పడుతూ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇలా బాహుబలి, సాహో సినిమాల తర్వాత ప్రభాస్ సినిమా విడుదల కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ప్రేక్షకుల అంచనాలను ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సినీ ప్రేక్షకులను సందడి చేస్తోంది.

ఇక ఈ సినిమా చూడటం కోసం ప్రభాస్ అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. ఈ క్రమంలో ని ప్రభాస్ నటించిన ఈ సినిమాకి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా పై ప్రశంసలు కురిపించగా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్ కూడా స్పందిస్తూ బాహుబలి సినిమాకు ఈ సినిమా ఏమాత్రం తీసిపోదని కామెంట్స్ చేశారు. ఇక ఈ సినిమాపై మంచు మనోజ్ స్పందిస్తూ… ఆన్ స్క్రీన్‌పై ప్రభాస్ డార్లింగ్‌ను చూడటానికి ఎదురు చూస్తున్నాను. థియేటర్లలో రాధేశ్యామ్‌ను చూడటానికి వెళ్లండి అంటూ ట్వీట్ చేశారు.

ప్రభాస్ డార్లింగ్‌కు నా బెస్ట్ విషెస్. రాధేశ్యామ్ యూనిట్‌కు శుభాకాంక్షలు. వెండితెరపై భారీ ప్రేమ కథా చిత్రాన్ని చూడటానికి ఎదురు చూస్తున్నాం అంటూ గోపీచంద్ మలినేని ట్వీట్ చేశారు. అలాగే రాధేశ్యామ్ చిత్ర బృందానికి దర్శకుడు మెహర్ రమేష్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, హను రాఘవపూడి, డైరెక్టర్ మారుతి, వెంకీ కుడుముల, డివి నిర్మాణ సంస్థ శుభాకాంక్షలు, ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా వరుస త్వీట్స్ చేశారు.