Charan: పంజాబీ పోలీసులకు చిక్కిన చరణ్.. వైరల్ గా మారిన ఫోటోలు!

Charan: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పంజాబ్ లో జరుగుతుంది. దీంతో అక్కడ పంజాబ్ పోలీసులు చరణ్ ను చూసి ఆయనతో ఫొటోలు దిగడానికి ముందుకువచ్చారు.

ఆర్ఆర్ఆర్ తో కేవలం టాలీవుడ్ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా చరణ్ మంచి పేరు సంపాదించుకున్నాడు. దీంతో ఆయనకు మరింత అభిమానం పెరిగింది. అందులో పంజాబ్ పోలీసుల అభిమానం కూడా ఉండటంతో.. తాజాగా శంకర్ దర్శకత్వంలో జరుగుతున్న షూటింగ్ సెట్ లో అక్కడ పోలీసులు ఆయన దగ్గరికి వచ్చి ఫోటోలు, సెల్ఫీలు దిగారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారింది.