Sundar Pichai: సుందర్ పిచాయ్ వేతనం భారీగా తగ్గింది… ఎందుకంటే..

గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సీఈఓగా కొనసాగుతున్న సుందర్ పిచాయ్ 2024లో గణనీయంగా తక్కువ పారితోషికం అందుకున్నారు. ఇటీవల సంస్థ విడుదల చేసిన 2025 ప్రాక్సీ స్టేట్‌మెంట్ ప్రకారం, ఆయనకు ఈ ఏడాది మొత్తం $10.72 మిలియన్ (సుమారు రూ.89 కోట్లు) మాత్రమే వేతనం ఇచ్చారు. 2022లో మాత్రం ఆయనకు ఏకంగా $226 మిలియన్ డాలర్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ భారీ తేడాకు ప్రధాన కారణంగా ఈసారి స్టాక్ అవార్డుల లేనివేళ నిలిచింది.

ఆల్ఫాబెట్ ప్రకటనలో వివరన ప్రకారం, పిచాయ్‌కు మూడేళ్లకు ఒక్కసారి పెద్ద మొత్తంలో స్టాక్ అవార్డులు లభిస్తాయి. అలాంటి స్టాక్ గిఫ్ట్ 2024లో కాకపోవడంతో, ఈసారి వారి మొత్త వేతనంలో భారీ తేడా వచ్చిందని చెబుతున్నారు. అయితే ఆయన బేసిక్ శాలరీ మాత్రం గతంలో మాదిరిగానే $2 మిలియన్ (సుమారు రూ.16.6 కోట్లు)గా కొనసాగింది. మిగిలిన మొత్తం స్టాక్ అవార్డులు, ఇతర ప్రోత్సాహకాలుగా ఇవ్వడం జరిగింది.

ఇక మరోవైపు, పిచాయ్ భద్రతపై కంపెనీ భారీగా ఖర్చు చేసింది. గతేడాది $6.78 మిలియన్ ఖర్చు కాగా, 2024లో ఇది $8.27 మిలియన్ (సుమారు రూ.69 కోట్లు)కి చేరింది. ఇది దాదాపు 22 శాతం పెరుగుదల అని పేర్కొన్నారు. ఇంటి భద్రత నుంచి, ప్రయాణాల్లో వ్యక్తిగత సెక్యూరిటీ వరకు అన్నిటి ఖర్చులు ఇందులో ఉన్నాయి. ప్రయాణాల సంఖ్య పెరగడం వల్లే ఈ ఖర్చు పెరిగిందని వెల్లడించారు.

ఈ భద్రతా ఏర్పాట్లపై కంపెనీ సరైన వివరణ ఇచ్చింది. ఇవి వ్యక్తిగత ప్రయోజనాలు కావని, సంస్థకే అవసరమైన భద్రతా చర్యలుగా పేర్కొంది. పిచాయ్ స్థాయి నాయకుడికి వ్యాపార రహస్యాలు, భద్రత పరంగా ఎదురయ్యే ముప్పులను దృష్టిలో ఉంచుకుని ఇవి తీసుకున్న చర్యలని పేర్కొంది. మొత్తానికి, వేతన పరంగా తగ్గినా… బాధ్యతల పరంగా సుందర్ పిచాయ్ ప్రాధాన్యత మాత్రం అలాగే కొనసాగుతుందని చెప్పవచ్చు.

డెమోక్రటిక్ సర్వే లో ఏపీ గురించి సంచలన నిజాలు | Purushotham About Democratic Survey | Ap | TR News