సుశాంత్ కేసు టాలీవుడ్ మెడకు కూడా చిక్కుకుందా? పెద్ద హీరో కొడుకుకు త్వరలో సీబీఐ షాక్?

the-mla-mlas-wife-together-ruined-the-girls-life

సుశాంత్ మరణం ఎంత సంచలనంగా మారిందో అందరికీ తెలుసు. ఆయన చనిపోయిన తర్వాత ఆ కేసు ఎన్నో మలుపులు తిరిగింది. నిజానికి ఎవ్వరూ ఊహించని విధంగా రకరకాల ట్విస్టులు బయటపడ్డాయి.

cbi to give shock to the son of big hero of tollywood
cbi to give shock to the son of big hero of tollywood

సుశాంత్ ది మొదటగా అందరూ ఆత్మహత్య అనుకున్నారు. తర్వాత అది ఆత్మహత్య కాదు.. హత్య అంటున్నారు. తర్వాత సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి లైన్ లోకి వచ్చింది. రియానే సుశాంత్ ను చంపించిందని సుశాంత్ సన్నిహితులు చెబుతున్నారు.

మరోవైపు సుశాంత్ కేసును దర్యాప్తు చేస్తుండగా… సీబీఐ అధికారులకు డ్రగ్స్ దందా లింక్ దొరికింది. సుశాంత్ మరణానికి, డ్రగ్స్ కు, రియాకు లింక్ ఉన్నట్టు తెలిసింది.

దీంతో ఇప్పటికే డ్రగ్స్ రాకెట్ నడుపుతున్న కొందరు ట్రాఫికర్స్ ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రియా ఇంట్లో కూడా సీబీఐ అధికారులు, ఎన్సీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

అయితే.. ఈ కేసు ఇప్పుడు టాలీవుడ్ మెడకు కూడా చుట్టుకున్నదట. అవును.. ఆ డ్రగ్స్ దందాలో టాలీవుడ్ కు చెందిన కొందరు సెలబ్రిటీలకు లింక్ ఉందట. ఇప్పటికే.. కన్నడ ఇండస్ట్రీకి ఈ డ్రగ్స్ దందాకు లింక్ ఉందని తెలిసింది. దీంతో సీబీఐ అధికారులు కొందరు కన్నడ సెలబ్రిటీలకు నోటీసులు కూడా పంపించారు.

ఇక.. తదుపరి టాలీవుడ్ అని.. టాలీవుడ్ లో పెద్ద హీరో కొడుకుకు, డ్రగ్స్ దందాకు సంబంధం ఉందని.. వెంటనే అతడికి నోటీసులు పంపించడానికి సీబీఐ అధికారులు సిద్ధమవుతున్నారట.

ఈ డ్రగ్ మాఫియాతో ఆ హీరో కొడుకుకు లింక్స్ ఉన్నాయట. ఆ హీరో కొడుకు కూడా ప్రస్తుతం హీరోగా కొన్ని సినిమాల్లో నటించాడంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో ఆ హీరో ఎవరు? అనే ప్రశ్న సినీ అభిమానుల్లో మొదలైంది.

మరి.. సీబీఐ అధికారులు.. ఆ హీరో కొడుకుకు కేవలం నోటీసులు మాత్రమే పంపిస్తారా? లేక అదుపులోకి తీసుకొని విచారిస్తారా? అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే.. ఆ వ్యక్తి ఎవరో మాత్రం బయటికి రాలేదు. ఒకవేళ సీబీఐ అధికారులు ఆ వ్యక్తి గురించి బయటపెడితే తప్ప అతడెవరో తెలిసే చాన్స్ లేదు.