‘బ్రో’ కథను ఫస్ట్ ఆ హీరోలతో చేయాలనుకున్నారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ వీకెండ్ లో కలెక్షన్స్ బాగానే సొంతం చేసుకుంది. కానీ సోమవారం నుంచి ఈ సినిమాకు అసలు పరీక్ష మొదలు కానుంది. సాయిధరమ్ తేజ్ ఈ సినిమాలో మొదటిసారి పవన్ కళ్యాణ్ తో కలిసి నటించాడు. తమిళంలో సక్సెస్ అయిన వినోదాయ సీతం సినిమాకు రీమేక్ గా వచ్చిన బ్రో సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహించగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు స్క్రీన్ ప్లే అందించారు.

అయితే ఈ సినిమా కథ తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నప్పుడు మెగా హీరోల కంటే ముందు మరి కొంతమంది హీరోలను కూడా అనుకున్నట్లు కొన్ని కథనాలు అయితే వెలువడుతున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ అఖిల్ పేర్లు కూడా లిస్టు లోకి వచ్చాయని పలు కథనాలు అల్లేస్తున్నారు. అంతేకాకుండా తమిళ హీరోలు సూర్య కార్తీతో తెలుగులో ఈ సినిమాను రీమేక్ చేయాలని సముద్రఖని ప్రయత్నాలు చేసినట్లు టాక్ అయితే వినిపిస్తోంది.

నిజానికి సముద్రఖని ఈ కథను తెలుగులో మొదట త్రివిక్రమ్ కు చెప్పాడు. ఎవరితో అయితే బెస్ట్ అవుతుంది అని అనుకున్నప్పుడు సాయి ధరమ్ తేజ్ పర్ఫెక్ట్ ఛాయిస్ అని అలాగే పవన్ కళ్యాణ్ టైం పాత్రలో బాగా సెట్ అవుతాడు అని ఆయన ఫస్ట్ ఛాయిస్ గా చెప్పారట. ఇక సముద్ర ఖని కూడా మరొక ఆలోచన లేకుండా ఆయన ఆలోచన ప్రకారం వారికి కథలు చెప్పి ఒప్పించాడు. ఇక ఈ సినిమా కోసం వీరి కంటే ముందు మిగతా తెలుగు హీరోలను ఎవరిని అనుకోలేదని తెలుస్తోంది.