అంబటికి “బ్రో”నిర్మాత సాఫ్ట్ వార్నింగ్.!

ప్రస్తుతం టాలీవుడ్ సినిమా దగ్గర వైరల్ గా ఒకింత కాంట్రవర్సియల్ గా కూడా మారుతున్నా లేటెస్ట్ టాలీవుడ్ చిత్రం ఏదన్నా ఉంది అది “బ్రో” చిత్రం అని చెప్పాలి. దర్శకుడు సముద్రఖని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే సాయి ధరమ్ తేజ్ లతో తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్యామ్ బాబుని నేనే అంటూ..

నన్నే టార్గెట్ చేసారు అంటూ ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు సినిమా యూనిట్ ని వసూళ్ళని నిర్మాతలు లెక్కలేని టార్గెట్ చేస్తూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యిపోయారు. కాగా ఈ చిత్రం పై కేసు కూడా వేయడానికి ఢిల్లీ పయనం అయ్యారు. అయితే ఈ విషయంలో మాత్రా బ్రో నిర్మాతలు కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు.

నిన్న  ఓ న్యూస్ ఛానెల్లో టిజి విశ్వ ప్రసాద్ హాజరు కాగా తమపై అంబటి రాంబాబు ఇలా వార్నింగ్ ఇస్తున్నారు అని కామెంట్స్ కోసం అడగ్గా తాను అసలు ఇప్పటి వరకు రాంబాబు మాటలు సీరియస్ గా తీసుకుంటేనే కాగా అవి ఇంకా నేను గాలి మాటలు గానే భావిస్తున్నాను అని చాలా సాఫ్ట్ గా చెప్పారు.

అంతే కాకుండా అంతవరకు వస్తే నేను ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నట్టు అయితే లీగల్ గా వెళ్ళడానికి కూడా రెడీ గా ఉన్నాను అని వెనక్కి తగ్గే సమస్యే లేదు అంటూ చాలా క్లారిటీగా హుందాగా సెలవిచ్చేసారు. మరి అసలు ఈ ఇష్యూ ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో అనేది చూడాల్సిందే.