బ్రేకింగ్ : “కేరళ స్టోరీ” కాంట్రవర్సీపై మరోసారి తేల్చేసిన కోర్టు.!

గత ఏడాది ఇండియన్ సినిమా దగ్గర పెద్ద ఎత్తున సంచలనం రేపిన సినిమాల్లో “ది కాశ్మీర్ ఫైల్స్” కూడా ఒకటి. ఇదెంత సంచలనం రేపింది అంటే ఓన్లీ హిందీలో ఉన్న ఈ చిత్రాన్ని తెలుగు సహా ఇతర భాష వాళ్ళు కూడా హిందీలో చూసేందుకు ఎగబడ్డారు. ఆ రేంజ్ లో దుమ్ము లేపిన ఈ సినిమాలో కాంట్రవర్సీ కూడా భారీ ఎత్తున అయ్యింది.

హిందూ ముస్లిం ల విషయంలో కొందరు ఈ సినిమా నిజంగా జరిగింది అని మరికొందరు లేదని చాలానే తతంగం నడిచింది. కాగా ఇదే సినిమా తరహాలో రిలీజ్ కి వస్తున్న చిత్రం “కేరళ స్టోరీ”. ఆదా శర్మ మెయిన్ లీడ్ లో నటించిన ఈ ఇంటెన్స్ హార్డ్ హిట్టింగ్ డ్రామా హిందీ ట్రైలర్ చూస్తేనే సగం అర్ధం అయ్యిపోతుంది.

ఇక ఈ ట్రైలర్ వచ్చాక మళ్ళీ కాశ్మీర్ ఫైల్స్ తరహాలో కాంట్రవర్సీ రేగగా ఈ సినిమా రిలీజ్ ఆపాలని ఇది వరకే సుప్రీం కోర్టును కొందరు ఆశ్రయించగా ధర్మస్థానం దానిని కొట్టి పారేసింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా మళ్ళీ బ్రేకింగ్ న్యూస్ బయటకి వచ్చింది. కేరళ స్టోరీ చిత్రాన్ని తాము ఆపడం లేదని,  అయ్యిపోయాక ఆపడానికి వీలు లేదని తేల్చేసింది.

అంతే కాకుండా ఏ సినిమా అయినా కూడా ప్రేక్షకులకి నచ్చితే చూస్తారు లేకపోతె లేదు ని కూడా మెన్షన్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ చిత్రం అయితే ఆగే ప్రసక్తి లేదని తెలుస్తుంది. కాగా పాన్ ఇండియా లెవెల్ సినిమాగా దీనిని అనౌన్స్ చేయగా ఇపుడు అయితే కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ తెలుస్తుంది.