పెళ్లి తర్వాత బాలీవుడ్‌ బ్యూటీ సోనమ్‌ కాస్త స్లో…!?

పెళ్లి తర్వాత హీరోయిన్ గా కాస్త స్లో అయ్యారు బాలీవుడ్‌ బ్యూటీ సోనమ్‌ కపూర్‌. రెండేళ్ల గ్యాప్‌ తర్వాత ఆమె ‘బ్లైండ్‌’ అనే సినిమాలో నటించింది. ఆ చిత్రం ఈ ఏడాది జూలైలో విడుదలైంది. అప్పుడప్పుడు తనపై విమర్శలు వస్తుంటాయి. వాటిపై ధీటుగా స్పందిస్తుంటారు సోనమ్‌. తాజాగా ఆమె ఓ యూట్యూబర్‌కు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

తన కుటుంబం గురించి హాస్యాస్పదమైన వ్యాఖ్యలు చేసినందుకు ఆ యూట్యూబర్‌కు ఆమె నోటీసులు పంపారు. సోనమ్‌ కపూర్‌ ఆమె భర్త ఆనంద్‌ అహూజా కాస్ట్యూమ్స్‌ బ్రాండ్ల గురించి రాగిణి అనే యూట్యూబర్‌ ఓ వీడియో చేశారు. అందులో ఆ దంపతుల గురించి ఆమె కామెడీగా మాట్లాడారు. ఇది సోనమ్‌ దాకా చేరడంతో వెంటనే సదరు యూట్యూబర్‌కు లీగల్‌ నోటీసులు పంపారు. ఈ మొత్తం విషయంపై యూట్యూబర్‌ వివరణ ఇచ్చింది.

‘‘నా వీడియో కింద ఎప్పుడూ ఒక నోట్‌ ఉంటుంది. ‘నేను చేస్తున్న వీడియోలు ఎవరినీ ఉద్దేశించినవి కావు. నాకు ఎవరిపై ద్వేషం ఉండదు. ఇది కేవలం వినోదం కోసం మాత్రమే’ అని ఆ నోట్లో ఉంటుంది’’ అని రాగిణి అన్నారు. సోనమ్‌ పంపిన లీగల్‌ నోటీసును కూడా ఆమె తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. ఈ వ్యవహారంపై నెటిజన్లు సోనమ్‌ కపూర్‌ను ట్రోల్‌ చేస్తున్నారు.

‘కేవలం 7 వేల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్న యూట్యూబర్‌ వినోదం కోసం వీడియో చేస్తే ఇలా చేస్తారా? ఎంటర్‌టైనమెంట్‌ రంగంలో ఇలాంటివి కామన్. దీనిని సీరియస్‌గా తీసుకోవడం కరెక్ట్‌ కాదు’ అంటూ విమర్శిస్తున్నారు. మరో నెటిజన ‘పెద్ద షోల్లో ఎలాంటి కామెంట్స్‌ చేసినా నవ్వుతారు. ఇలాంటి వాళ్లకు మాత్రం నోటీసులు పంపుతారా’ అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఇష్యూ తర్వాత రాగిణి ఛానల్‌ ఉన్న 7 వేల మంది సబ్‌ స్క్రిప్షన్‌ ఒక్కసారిగా 37 వేలకు పెరిగింది.