సినిమా ఇండ‌స్ట్రీలో క‌రోనా వ్యాక్సిన్‌ వేయించుకున్న తొలి న‌టి.. ఆమె ఎవ‌రో తెలుసా?

కరోనా.. యావత్ ప్రపంచాన్నే వణికించిన వైరస్.. కంటికి కనిపించకుండానే మనిషి ప్రాణాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని భయపెట్టించింది. నిరంతరం శానిటైజర్, మాస్కులతో, బయటకు వెళ్ళకుండానే బందీని చేసింది. ఎక్కడో చైనీస్ దేశంలో పుట్టి విశ్వమంతా వ్యాపించి సామాన్య ప్రజానికంపై తన రక్షసత్వాన్ని ప్రదర్మించింది. అలాంటి ఓ మహమ్మారికి విరుగుడు దొరికింది. ప్రపంచానికి వైరస్ తెర తీసే సమయం వచ్చింది. ఫైనల్ గా కోవిడ్ 19 కి 2021 లో సంపూర్ణంగా వ్యాక్సిన్ లభించింది.
యావత్ ప్రపంచమే టీకాను తీసుకోవాలని ప్రచారం చేస్తోంది. ప్రతి మనిషి తన ప్రాణాన్ని కరోనా భారి నుండి తప్పించుకోవడానికి, వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఎంతో ఎదురుచూస్తున్నాడు. భారత్ లో కూడా అతి త్వరలోనే కరోనా వ్యాక్సిన్ కి సంబంధించిన ఏర్పాట్లు రెడీ చేస్తోంది. అయితే కరోనా వ్యాక్సిన్ రావడానికి దాదాపు సంవత్సరం పాటు పట్టింది. ఈలోగా ఎంతోమంది ప్రాణాలు హరించిపోయాయి.


ఇప్పటికే ఎన్నో దేశాల్లో కరోనా వ్యాక్సిన్ ను అమలుచేస్తున్నాయి. ఇక ఇప్పుడు లేటెస్ట్ బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ కరోనా వ్యాక్సిన్ వేయించుకుని మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న నటిగా నిలిచింది. అయితే ఆమె వ్యాక్సిన్ వేయించుకుంది ఇండియాలో కాదు. దుబాయ్ లో. ఆమె ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నారు. తాను రీసెంట్ గా కోవిడ్ కు వ్యాక్సిన్ వేయించుకున్నానని.. ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ ఫోటోను షేర్ చేసి.. వ్యాక్సిన్ వేయించుకున్నట్లు ఆమె చేయికి ఉన్న బ్యాండేజ్ ను చూపిస్తూ పోస్ట్ చేసింది.

ఈ పోస్ట్ లో వ్యాక్సినేషన్ పూర్తయింది. సురక్షితం.. యూఏఈ ధన్యవాదాలు తెలుపుతున్నానంటూ క్యాప్షన్ ఇచ్చింది. శిల్పా శిరోద్కర్ మోడల్ గా, నటిగా ఎంతో పేరు సంపాదించుకున్నారు. ప్రిన్స్ మహేష్ బాబుకు నమ్రతా శిరోద్కర్ కు శిల్ప శిరోద్కర్ సోదరి. ఆమె భ్రష్టాచార్ అనే సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఎన్నో టీవీ షోల్లో కనిపించారు.