‘జుట్టు లాగి తల మంచానికేసి కొట్టాడు’ మొగుడి మీద టాప్ హీరోయిన్ సంచలన ఆరోపణలు!

Poonam With Her Husband Sam Bombay

బాలీవుడ్ నటి పూనమ్ పాండే తన భర్త, నిర్మాత శ్యామ్ బాంబేపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనను శారీరకంగా హింసిస్తున్నాడని గోవా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేసుకొని పూనమ్‌ భర్తను పోలీసులు ఆరెస్ట్‌ చేశారు. అయితే అరెస్ట్‌ అయిన కొద్దిగంటల్లోనే బెయిల్‌పై బయటకి వచ్చాడు. అయితే వివాహమై రెండు వారాలు కాకముందే తన భర్తపై పూనమ్‌ పాండే పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే వీరిద్దరు గోవాకు ఎందుకు వెళ్లారు? పూనమ్‌పై ఆమె భర్త దాడి చేశాడా? చేస్తే ఎందుకు? అనే విషయాలు తెలుసుకునేందుకు అందరూ ఉత్సుకతో ఉన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి అన్ని విషయాలను పూనమ్‌ తాజాగా వెల్లడించింది.
‘సినిమా షూటింగ్‌కు కోసం మేమిద్దరంగా గోవా వెళ్లాము. శ్యామ్‌ నన్ను కొట్టడానికి ముందు ఒక విషయంపై వాదన వచ్చింది. మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో శ్యామ్‌ నా ముఖంపై దాడి చేశాడు. అంతేకాదు జట్టును లాగి మంచానికి పెట్టి తలను కొట్టాడు. ఒక జంతువులా నాపై దాడి చేశాడు. అయితే ఏదోలా బయటపడి హోటల్‌ సిబ్బందిని పిలిచాను. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే గతంలో కూడా నాతో చెడుగా ప్రవర్తించినా నేను ప్రేమించిన వాడు కావడంతో సంబంధాన్ని కొనసాగించారు. అన్నీ కుదురుకుంటాయనే ఆశతో పెళ్లి చేసుకున్నాను’ అంటూ పూనమ్‌ తెలిపింది.

శ్యామ్ బాంబేను తాను వివాహం చేసుకోబోతున్నట్టు ఈ ఏడాది జులైలో పూనమ్ ప్రకటించింది. నిశ్చితార్థం చేసుకున్న ఉంగరాలను చూపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. ఈ నెల 10న శ్యామ్‌తో వివాహమైనట్టు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. ఏదేమైనా ఇప్పుడు వీరిద్దరి వైవాహిక బంధం ముగిసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకుంటే జంతువులాగా ఒకరిని కొట్టిన వ్యక్తి వద్దకు తిరిగి రావడం మంచి ఆలోచన కాదని పూనమ్‌ పేర్కొనడం గమనార్హం.