Bigg Boss Akhil: నమ్ముకున్న వాడికి ద్రోహం చేసిన అఖిల్… అండగా నిలిచిన బిందుమాధవి!

Bigg Boss Akhil: బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం ఓటీటీలో 24 గంటల పాటు ప్రసారం ప్రేక్షకులను సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ కార్యక్రమంలో భాగంగా కంటెస్టెంట్ లు తీవ్ర స్థాయిలో గొడవలు పడటం ఎమోషన్ అవ్వడం, టాస్క్ ల విషయానికి వచ్చేసరికి ఒకరిపై మరొకరు బూతులు తిట్టుకుంటూ కొట్టుకోవడానికి కూడా వెనకాడటం లేదు. ఈక్రమంలోనే 8వ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.

అలాగే బిగ్ బాస్ హౌస్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన అఖిల్ గురించి అందరికీ తెలిసిందే ఈయన గతంలో కూడా బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇకపోతే అఖిల్, అజయ్, స్రవంతి,అషురెడ్డి, నటరాజ్‌లు ఒక గ్రూపుగా ఉండేవారు. ఇక ఆరవ వారం స్రవంతి ఎలిమినేట్ కావడంతో అఖిల్ బ్యాచ్ లోకి బాబా మాస్టర్ చేరిపోయారు. ఇన్ని రోజులు అజయ్ ను బీభత్సంగా వాడుకున్న అఖిల్ ప్రస్తుతం తనని దూరం పెట్టినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఈ వారం యాక్టివిటీ లో భాగంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ లకు ఒక టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో భాగంగా బ్యాక్ స్టెప్ చేసే ఆ ఒక్కరు ఎవరు? ఎవరు మిమల్ని సేవ్ చేస్తారనే టాస్క్ కంటెస్టెంట్స్ కు బిగ్ బాస్ ఇచ్చాడు. అయితే హౌస్ లో ఎవరితోనూ తనకు అంత బాండింగ్ లేదని ఎవరికీ తాను సేవ్ ట్యాగ్ ఇవ్వాలి అనుకోవడం లేదంటూ అఖిల్ తెలిపారు. ఈ మాటకు బిగ్ బాస్ ఎవరికో ఒకరికి తప్పనిసరిగా సేవ్ ట్యాగ్ ఇవ్వాలని సూచించారు. దీంతో అఖిల్ అజయ్ కి కాకుండా మిత్ర శర్మకు సేవ్ ట్యాగ్ ఇచ్చారు. ఇలా ఇన్ని రోజులు వాడుకొని అజయ్ ను పక్కనబెట్టి అఖిల్ ప్లేటు ఫిరాయించడంతో బిందు మాధవి అజయ్ కి సేవ్ ట్యాగ్ ఇచ్చారు.