మహేష్ – రాజమౌళి ప్రాజెక్ట్ పై బిగ్ అప్డేట్.!

ప్రస్తుతం ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా టోటల్ ఇండియన్ సినిమా దగ్గరే బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ సినిమా ఏదన్నా ఉంది అంటే ఆ సినిమా ఖచ్చితంగా సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు సెన్సేషనల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ల కాంబినేషన్ అని చెప్పాలి.

మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడో అనౌన్స్ కావాల్సింది కానీ వరల్డ్ వైడ్ రాజమౌళి భారీ ఫేమ్ వచ్చిన తర్వాతే సెట్ అవ్వాలి అన్నట్టుగా ఈ కాంబో లాక్ అయ్యింది. కాగా ఈ మాసివ్ ప్రాజెక్ట్ ఏకంగా వరల్డ్ లెవెల్ ప్రాజెక్ట్ గా అనౌన్స్ కాగా దీనిపై భారీ హైప్ నెలకొంది.

అయితే మరి ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలు అవుతుందా అని చాలా మంది ఆసక్తిగా చూస్తుండగా దీనిపై బిగ్ క్లారిటీ అయితే ఇప్పుడు తెలుస్తుంది. సినీ వర్గాల నుంచి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి పట్టాలెక్కనుంది అని తెలుస్తుంది.

ఆల్రెడీ రాజమౌళి పలు భారీ ప్లాన్స్ ఈ సినిమాకి చేస్తున్నారు. హాలీవుడ్ నుంచి ఈ సినిమాలో పలు స్పెషల్ సీక్వెన్స్ లు కోసం కొన్ని సంస్థలతో టై అప్ అయ్యి భారీ ప్లానింగులు ప్రీ ప్రొడక్షన్స్ లో చేస్తున్నారు. ఇక ఈ సినిమా అయితే ఓ భారీ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా ఉండనుండగా ఇది కూడా రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా సుమారు 600 కోట్లకి పైగానే బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారట.