మరోసారి కరోనా బారిన పడ్డ బిగ్ బీ… ఆందోళనలో అభిమానులు!

గత మూడు సంవత్సరాల నుంచి కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలోనూ వ్యాప్తి చెంది పెద్ద ఎత్తున అందరిని తీవ్రభయాందోళనలకు గురిచేస్తుంది.అయితే ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గిందని భావిస్తున్నప్పటికీ పలుచోట్ల కరోనా వ్యాప్తి చెందుతూ ఉంది. ఈ క్రమంలోనే ఇప్పటికీ పలువురు ఈ కరోనా బారిన పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బీ అమితాబచ్చన్ మరోసారి కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలోనే ఈయన ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

ఇకపోతే ప్రస్తుతం అమితాబచ్చన్ కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్ 14 లో బిజీగా ఉన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఎంతోమంది కొత్త కంటెస్టెంట్లను కలిసిన విషయం మనకు తెలిసిందే.ఈ విధంగా అమితాబచ్చన్ కొత్త వారిని కలవడంతో ఇలా కరోనా బారిన పడి ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు. అయితే గతంలో కూడా ఈయన ఒకసారి కరోనా బారినపడి ఆసుపత్రిలో చికిత్స తీసుకొని ఈ మహమ్మారి నుంచి బయటపడ్డారు. ఈ క్రమంలోనే అప్పటినుంచి ఈయన చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా తాజాగా మరోసారి అమితాబచ్చన్ కరోనా బారిన పడ్డారని తెలియగానే అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే వయసు పై పడటమే కాకుండా రెండుసార్లు కరోనా బారిన పడటంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇక సోషల్ మీడియా వేదికగా తనకు కరోనా వచ్చిందని తెలిపిన అమితాబచ్చన్ ప్రస్తుతం తాను ఆసుపత్రిలో ఉన్నారా ఇంట్లో ఉన్నారా అనే విషయాన్ని వెల్లడించలేదు.అయితే ఈయన ఎక్కడున్నా తాను క్షేమంగా తిరిగి మామూలు స్థితికి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.