Jr NTR: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో టాలీవుడ్ టాప్ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా ద్వారా రాజమౌళి ఇద్దరు హీరోలను పాన్ ఇండియా హీరోలుగా మార్చేశాడు. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించిన ఈ చిత్రం మార్చ్ 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అయింది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుండి మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమా 1000 కోట్ల క్లబ్ లో చేరి చరిత్ర సృష్టించింది.
ఆర్ఆర్ఆర్ సినిమా మంచి విజయం సాధించిన ఈ తరుణంలో రామ్ చరణ్ తన ఇష్టదైవమైన అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టారు. ఇప్పటికే రామ్ చరణ్ ఎన్నో సార్లు అయ్యప్ప దీక్ష తీసుకున్నారు. ఇటీవల మరొకసారి రామ్చరణ్ అయ్యప్ప దీక్షను తీసుకున్నాడు. అయితే ఈ విషయంలో లో ఎన్టీఆర్ రామ్ చరణ్ ని ఫాలో అవుతున్నట్లు రూమర్లు హల్ చల్ చేస్తున్నాయి. రామ్ చరణ్ లాగా ఎన్టీఆర్ కూడా మాల వేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రామ్ చరణ్ లాగా ఎన్టీఆర్ కూడా తన ఇష్టదైవమైన ఆంజనేయస్వామి దీక్షను 21 రోజులపాటు తీసుకుంటున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా దీక్ష చేపట్టలేదు. మరి ఈ విషయంలో ఇప్పుడు వస్తున్న వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో లేదో తెలియాలి. ఎన్టీఆర్ ప్రస్తుతం తన 30 వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నాడు. రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చేయనున్నాడు. అయితే వీరిద్దరూ వచ్చే మార్చిలో సినిమాల విషయంలో ఒకరితో ఒకరు పోటీ పడనునట్టు సమాచారం.
