ఛత్రపతిపై ఆశలు వదులుకున్న బెల్లంకొండ.. మరో న్యూ స్టోరీ!

బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపును అందుకోవాలని ఆ మధ్యన ఎంతో హడావిడి చేసి చత్రపతి రీమేక్ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేశాడు. అయితే ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ పూర్తయిన కూడా విడుదలకు నోచుకోవడం లేదు. పెన్ స్టూడియోస్ ఈ సినిమాను హిందీలో నిర్మించింది.

అయితే ఇంతవరకు విడుదలపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. పెద్దగా థియేట్రికల్ బిజినెస్ పై జరగకపోవడంతో సినిమాను ఓటీటీ లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా ఇప్పుడు ఆ ప్రాజెక్టుపై పెద్దగా ఫోకస్ చేయడం లేదట. ఇక వెంటనే తెలుగులో మళ్ళీ సెట్ అవ్వాలి అని మరో కథను రెడీ చేస్తున్నట్లు సమాచారం.

భీమ్లా నాయక్ దర్శకుడు సాగర్ చంద్రతో ఒక స్టోరీ ఫైనల్ అయినట్లు ఆమధ్య కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే మొత్తానికి ఇప్పుడు ఫైనల్ స్క్రిప్ట్ రెడీ కావడంతో బెల్లంకొండ చత్రపతి కథ గురించి మర్చిపోయే మళ్లీ ఇప్పుడు సాగర్ తో కొత్త కథను లైన్లోకి తీసుకు వస్తున్నాడు. ఈ సినిమాను 14 రీల్స్ ప్రొడక్షన్స్ నిర్మించిననుట్లు సమాచారం.

ఇక రెగ్యులర్ షూటింగ్ ను మార్చి నెలలో మొదలు పెట్టాలని చూస్తున్నారు. ఈ ఏడాదిలో ఎలాగైనా బెల్లంకొండ తెలుగు ఆడియోన్స్ ఆకర్షించే విధంగా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. చివరిగా అతను 2021లో అల్లుడు అదుర్స్ అనే సినిమాతో వచ్చాడు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. మరి ఇప్పుడు చేయబోయే సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.