నమ్మినవాళ్లే మోసం చేశారు.. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డాను

టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ కమెడియన్ గా గుర్తింపు పొందిన గీతా సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా నటించిన కితకితలు సినిమాలో అల్లరి నరేష్ కి జోడిగా నటించిన గీతా సింగ్ ఆ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించింది. ఈ సినిమా ద్వారా గీత సింగ్ నటిగా మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో కమెడియన్ గా నటించి ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది.

అయితే గత కొంతకాలంగా గీత సింగ్ సినిమాలలో కనిపించడం లేదు. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న గీతా సింగ్ తన వ్యక్తిగత విషయాల గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ క్రమంలో గీతా సింగ్ మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో లేడీ కమెడియన్స్ కి అవకాశాలు ఇవ్వటం లేదని పరిశ్రమలో పురుషాధిక్యత ఎక్కువగా ఉందని వెల్లడించింది. అందువల్ల సినిమాలలో అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ రెండుసార్లు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించానని చెప్పుకొచ్చింది.

అంతేకాకుండా ఇండస్ట్రీలో ఉన్న లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని నమ్మి చిట్టీలు వేసి ఆరు కోట్ల రూపాయలు పోగొట్టుకున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. తన వద్ద డబ్బులు ఉన్నంతకాలం తన చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులకు కూడా డబ్బు లేకపోయేసరికి తనని పట్టించుకోవడంలేదని…స్వయానా తన తోడు పుట్టిన చెల్లెలు కూడా డబ్బులు లేకపోతే తన గురించి పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఆపదలో ఉన్న సమయంలో తన స్నేహితురాలు కాపాడి ఇప్పటికీ తనే అండగా నిలిచిందని గీతా సింగ్ తన వ్యక్తిగత విషయాల గురించి మనసులో ఉన్న బాధని బయటపెట్టింది.