తెలుగు సినిమాని అవమానించారు – బాలయ్య ఘాటైన కామెంట్స్

టాలీవుడ్ మాస్ గాడ్ నందమూరి నట సింహాం నందమూరి బాలకృష్ణ హీరోగా ఇపుడు దర్శకుడు అనిల్ రావిపూడితో అయితే “భగవంత్ కేసరి” అనే సినిమాలో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఈ చిత్రం ఇప్పుడు షూటింగ్ దాదాపు ఫినిష్ అయ్యిపోయింది. దీనితో బాలయ్య కూడా తన ఫ్రీ టైం వచ్చేసరికి తన పొలిటికల్ పనుల్లో కూడా పడ్డారు.

ఇదిలా ఉండగా తాజాగా బాలయ్య ఏపీ రాజకీయ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనగా అక్కడ కూడా సినిమా టాపిక్ రావడం వైరల్ గా మారింది. ప్రముఖ మంత్రి అంబటి రాంబాబుకి తనకి ఏమైందో కానీ ఒక్కసారిగా అసెంబ్లీ హీటెక్కింది. ఇద్దరూ ఒకరిని ఒకరు దుయ్యబడుతూ దుర్భాషలు ఆడుతూ సవాళ్లు చేసుకున్నారు.

అయితే బాలయ్య బయటకి వచ్చాక పెట్టిన ప్రెస్ మీట్ లో పలు సంచలన కామెంట్స్ చేశారు. అసెంబ్లీలో నన్ను ఉద్దేశించి తెలుగు సినిమాని అవమానించారు అని అందుకే నేను ఆవేశంగా ముందుకు వెళ్లానని సమర్ధించుకున్నారు. అంతే కాకుండా తెలుగు సినిమా విషయంలో ధైర్యంగా మాట్లాడగలిగే వారు టాలీవుడ్ లో చాలా తక్కువ మందే ఉన్నారు అందులో నేను ఒకడని అని కూడా యాడ్ చేశారు.

దీనితో బాలయ్య కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి. అయితే మరికొందరు విలువైన అసెంబ్లీ సమయాన్ని ఏపీలో రాజకీయ నాయకులు తమ పర్శనల్ గొడవలూ చేస్తూ ప్రజా సమస్యలు గాలికి వదిలేస్తున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు.