ఎన్టీయార్‌తో బాలయ్య ‘భగవంత్’ ప్రయత్నాలు బెడిసికొట్టాయ్.!

రాజకీయ విబేధాలెలా వున్నా.. ‘అఖండ’ సినిమా కోసం వైసీపీ సర్కార్‌ని బతిమలాడుకోక తప్పలేదు నందమూరి నటసింహం బాలయ్యకి. ఆ సినిమా టైమ్‌లో వైసీపీ సర్కారు సినీ జనాలకి చుక్కలు చూపించేసింది.

అలాంటి టైమ్‌లో వైసీపీ సర్కార్‌‌తో రకరకాల మంతనాలు జరిపి.. ఎలాగోలా ఆ సినిమాని సక్సెస్ బాట పట్టించారాయన. అప్పుడు ప్రయత్నం ఫలించింది. ‘అఖండ’ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది.

బాక్సాఫీస్ వసూళ్లు కొల్లగొట్టింది. వంద కోట్ల క్లబ్సులో చేరి రికార్డులు సృష్టించింది. అలాగే, ఇప్పుడు అలాంటి ప్రయత్నంలోనే బిజీగా వున్నారట బాలయ్య.

అయితే, ఈ సారి వైసీపీ సర్కార్‌తో కాదు, ఎన్టీయార్‌తో మంతనాలు చేయాలనుకుంటున్నారట. జూనియర్ ఎన్టీయార్‌కీ, బాలయ్యకీ మధ్య బొత్తిగా పొసగదన్న సంగతి తెలిసిందే. కానీ, అవసరం అలాంటిది.

‘భగవంత్ కేసరి’ సినిమాకి పెద్దగా బజ్ క్రియేట్ కావడం లేదు. రిలీజ్‌కి ముందు ఎలాగో నెట్టుకొచ్చారు. కానీ, రిలీజ్ తర్వాత తుస్సుమంది. బాలయ్య ఫ్యాన్స్ ఓకే కానీ.. ఎన్టీయార్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాని లైట్ తీసుకుంటున్నారట.

అందుకే ఎన్టీయార్‌తో ఓ ట్వీట్ వేయించాలని ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా ప్రయత్నాలు చేస్తున్నారట బాలయ్య. కేవలం సినిమా గురించే కాదు, పొలిటికల్‌గా కూడా ఉపయోగపడుతుంది.. అన్న కోణంలో ప్రయత్నాలు చేశారట. కానీ, అవేమీ పలించలేదనీ, పూర్తిగా బెడిసికొట్టాయనీ తెలుస్తోంది.

బాలయ్య ప్రతిపాదనలకు ఎన్టీయార్ సుముఖత వ్యక్తం చేయలేదనీ ప్రచారం జరుగుతోంది. దాంతో, ఎన్టీయార్ అభిమానుల ద్వారా ఈ సినిమాని గట్టెక్కించుకోవాలన్న బాలయ్య ప్రయత్నం తుస్సు తుస్సేనట.!