ఆ ఊసే వద్దంటోన్న బాలయ్య.!

ఎలక్షన్స్ రాబోతున్నాయ్. ఈ నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలు పలు రకాల రాజకీయ వ్యూహాలు రచిస్తూ వుంటారు. ఈ నేపథ్యంలోనే ఓ ప్రముఖ దర్శకుడు బాలయ్య వద్దకు ఓ ప్రపోజల్ తీసుకొచ్చాడట.

ఎలక్షన్స్ కదా.. ఎన్టీయార్ మీద సినిమా చేసి వదులుదాం, పార్టీకి హైప్ పెరుగుతుంది అని సూచించారట. తెలుగు దేశం పార్టీకి అత్యంత సానుభూతి పరుడు ఆ నిర్మాత అని గుసగుసలాడుకుంటున్నారు.

అవును నిజమే, సినిమా ప్రభావం ఎంతో కొంత ఉండకుండా పోదు. అయితే, గతంలో చేసిన తప్పు మళ్లీ బాలయ్య చేస్తాడా.? అదేనండీ, గతంలో ఎన్టీయార్ బయోపిక్ పేరు చెప్పి బాలయ్య చేసిన తప్పిదం అందరికీ తెలిసిందే.

తండ్రి పేరు నిలబెట్టకపోయినా పర్లేదు కానీ, ఆ బయోపిక్ చేసి తండ్రి పేరు చెడగొట్టిన కొడుకు అనే నింద వేయించుకున్నాడు బాలయ్య. సో, అది గుర్తొచ్చే ఆ ప్రయత్నాలు అస్సలు చేయద్దంటున్నాడట. అసలు ఆ ప్రతిపాదనే తన వద్ద తీసుకురావద్దని బాలయ్య తన స్టైల్‌లో వార్నింగ్ ఇచ్చేశాడట.

అంతేగా. అంతేగా.! మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తారా మరి. అప్పుడే ఏదో అలా జరిగిపోయిందంతే. అయినా ప్రస్తుతం బాలయ్య వరుస సినిమాలతో బిజీగా వున్నాడు. త్వరలో ‘భగవంత్ కేసరి’ పూర్తి చేయబోతున్నాడు.

ఈ సినిమా తర్వాత మళ్లీ తదుపరి సినిమానీ పట్టాలెక్కించే యోచనలో వున్నాడు. ఎలక్షన్స్ లోపలే బాలయ్య నుంచి కూడా కనీసం రెండు సినిమాలు వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాడట. అదీ సంగతి.