Avika Gor: తెలుగు వారికి టాలీవుడ్ హీరోయిన్ అలాగే చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలామంది అవికా గోర్ అంటే గుర్తుపెట్టుకోపోవచ్చు కానీ చిన్నారి పెళ్ళికూతురు అంటే చాలు ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఆ తర్వాత హీరోయిన్ గా ఆమెకు బాగా గుర్తింపు తెచ్చి పెట్టిన సినిమా అంటే ఉయ్యాల జంపాల అని చెప్పాలి. ఈ సినిమాతో కూడా బాగా ఫేమస్ అయ్యింది అవికా గోర్. ఈ సినిమా తర్వాత అంతకుముందు కొన్ని సినిమాలలో నశించినప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదని చెప్పాలి. ప్రస్తుతం కేవలం అడపాదడపా సినిమాలలో నటిస్తోంది అవికా గోర్.. సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా అభిమానులకు ఒక ఊహించని సర్ప్రైజ్ ను షాక్ ను ఇచ్చింది అవికా గోర్. అదేమిటంటే ఈమె త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతోంది. తాజాగా అవికా గోర్ నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ సందర్భంగా తన ప్రియుడు మిలింద్ చంద్వానీతో కలిసి ఉంగరాలు మార్చుకుందీ అందాల తార. అనంతరం ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలను షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది. అతను నోరు తెరిచి అడగ్గానే ఆనందంతో ఏడ్చేశాను. ఈ క్షణం కోసమే ఎదురు చూస్తున్నట్లుగా అవును అంటూ గట్టిగా అరిచాను.
పూర్తిగా సినిమాల్లో మునిగిపోయిన నాకు ఇప్పుడు మైండ్లో మంచి బీజీఎమ్ వినిపిస్తోంది. స్లో మోషన్ లో మా కల సాకారమైనట్లు కనిపిస్తోంది. అతనేమో ప్రశాంతగా ఉన్నాడు, తెలివిగా కనిపిస్తున్నాడు. అయినా మేమిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్. జంటగా బాగా ఫిట్టయ్యాము. ఎప్పుడైతే అతడు నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడో అప్పుడు నాలో ఉన్న హీరోయిన్ నన్ను పూర్తిగా ఆవహించింది. గాల్లో తేలిపోయా,కళ్లనిండా నీళ్లు మెదడు ఆలోచించడమే మానేసినట్లు ఇలా రకరకాలుగా అనిపించింది. నిజమైన ప్రేమంటే ఇదే నేమో.. ప్రేమలో అన్నీ పర్ఫెక్ట్ గా ఉండకపోవచ్చు. కానీ అందులో ఉన్న మ్యాజిక్కే వేరు అని రాసుకొచ్చింది అవికా గోర్. ప్రస్తుతం అవికాగోర్, మిలింద్ చంద్వానీ ఎంగేజ్ మెంట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
వీటిని చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కాబోయే దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ముంబైలో పుట్టిన అవికా గోర్ పదేళ్ల వయసులోనే కెమెరా ముందుకు వచ్చిన బాలికా సీరియల్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సీరియల్ తెలుగులో చిన్నారి పెళ్ళికూతురు పేరుతో విడుదల అయిన విషయం తెలిసిందే. అవికా గోర్ ను మనువాడబోయే మిలింద్ చాంద్వానీ విషయానికి వస్తే.. ఇతను ఒక సామాజిక కార్యకర్త, వ్యాపారవేత్త, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఐఐఎం అహ్మదాబాద్ లో ఎంబీఏ పూర్తి చేశారు. ప్రస్తుతం క్యాంప్ డైరీస్ అనే స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నాడు. 2019లో క్యాంప్ డైరీస్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో అవికా గోర్ పాల్గొంది. అప్పటి నుంచే మిలింద్ తో పరిచయం పెరిగింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఇప్పుడు పెళ్లితో తమ బంధాన్ని మరింత పదిలం చేసుకోనున్నారు.