Roja: రోజా గారి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించిన ఆటో రాంప్రసాద్..!

Roja: ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా జడ్జిగా అందరినీ అలరించిన రోజా ఇటీవల మంత్రి పదవి దక్కడంతో ఆస్థానానికి స్వస్తి పలికింది. జబర్దస్త్ కామెడీ షో ప్రారంభమైన నాటి నుండి ఇప్పటివరకు రోజా ఈ షోలో జడ్జిగా వ్యవహరించింది. దీంతో జబర్దస్త్ లో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్స్ అందరితో ఎంతో అనుబంధం ఏర్పరచుకుంది. ఇటీవల రోజాకి మంత్రి పదవి దక్కటంతో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కంటెస్టెంట్ లు అందరూ కలిసి రోజా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఇటీవల జరిగిన ఎపిసోడ్ లో సుధీర్ మాట్లాడుతూ రోజా గారితో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు. ” జబర్దస్త్ షో చేయడానికి మల్లెమాల వారి నుండి ఎంత సహకారం లభించిందో.. రోజా గారి నుండి కూడా అంతే సహకారం లభించింది. ఇన్ని రోజులు మాతో కలిసి ఉన్న రోజా ఇప్పుడు ప్రజా సేవకై ఈ షో కి స్వస్తి చెప్పారు. కానీ రోజాగారు ఈ షో కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” . అని రోజా కాళ్ళకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు.

ఈ సందర్భంగా ఆటో రాంప్రసాద్ ఎమోషనల్ అవుతూ రోజా గారి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఇంతకాలం ఇంటి నుండి అసెంబ్లీకి వెళ్తున్న రోజా గారు త్వరలోనే పార్లమెంట్ కి వెళ్లాలని కోరుకుంటున్నాను. రోజాగారికి మంత్రి పదవి దక్కటం చాలా సంతోషంగా ఉంది . రోజాగారు మీరు ఎప్పుడు మీ నవ్వు, మీ అందం అలాగే మైంటైన్ చేయండి అని చెప్పాడు. నాకు ఆటో రామ్ ప్రసాద్ అని పేరు రోజా గారే పెట్టారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. ప్రజా సేవ చేయడానికి అవకాశం వచ్చినందుకు మిమ్మల్నందర్నీ మిస్ అవుతున్నానని రోజా గారూ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.