Theaters: థియేటర్స్‌కు ఆడియన్స్ రావడం లేదనే మాట నిజమేనా?

ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట – “ఆడియన్స్ థియేటర్స్‌కు రావడం లేదు”. కొన్ని సినిమాలు ఆశించిన వసూళ్లు రాకపోవడంతో ఈ మాట మరింతగా గట్టిగా వినిపిస్తోంది. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. థియేటర్స్‌కు ప్రేక్షకులు వెళ్తున్నారు, కానీ వాళ్లు కోరుకున్న కంటెంట్‌ను మాత్రమే ఆదరిస్తున్నారు.

సినిమా బాగుంటే ఎప్పటికప్పుడు ఆడియన్స్ థియేటర్స్‌కు పోతున్నారనడానికి ‘హనుమాన్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘కోర్టు’, ‘టిల్లు స్క్వేర్’ సినిమాలే ఉదాహరణ. వీటి వరుస విజయాలు, పెద్దగా ప్రమోషన్ లేకున్నా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన వసూళ్లు చూస్తేనే తెలుస్తుంది. ప్రజలు బాగా కనెక్ట్ అయ్యే కథ, వినోదం, వినూత్నత ఉంటే సినిమా సైజు తో సంబంధం లేకుండా ఆడియన్స్ ఆదరిస్తున్నారు.

‘పుష్ప’ లాంటి పెద్ద సినిమాలే కాదు, ‘కోర్టు’ లాంటి చిన్న సినిమాలు కూడా థియేటర్లలో దుమ్ముదులిపేలా ఆడాయి. ఆడియన్స్‌ను ఆకట్టుకునే కథ, ఆకర్షణీయమైన కథనాలతో వచ్చిన సినిమాలు ఎప్పటికప్పుడు మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇటీవలి విజయాలు చూస్తే, ఆడియన్స్ రారనే వాదన అర్థరహితం అన్నది స్పష్టమవుతుంది.

ఫైనల్‌గా చెప్పాలంటే, ఆడియన్స్ థియేటర్స్‌కు రావడం మానేయలేదు. మేకర్స్ అందించే కంటెంట్ మీదే ప్రేక్షకుల స్పందన ఆధారపడుతోంది. కథ చెప్పడంలో నైపుణ్యం ఉంటే, ఎన్ని థియేటర్స్ అయినా నిండిపోతాయి. కాబట్టి, సినిమాకు కథే రాజు అన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇకనైనా మేకర్స్ ఆడియెన్స్ ని మెప్పించే కంటెంట్ తో వస్తే బెటర్.