బుచ్చిబాబు చరణ్ సినిమా కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారా.. తేడా వచ్చిందో అంతే సంగతులు?

ఉప్పెన సినిమా ద్వారా తెలుగు తెరకు దర్శకుడుగా పరిచయమయ్యారు సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు.ఈయన ఉప్పెన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇలా మొదటి సినిమానే బ్లాక్ బాస్టర్ అయినప్పటికీ ఈయనకు రెండో సినిమా అవకాశం రావడానికి దాదాపు రెండు సంవత్సరాల సమయం పట్టిందని చెప్పాలి.ఇక మొదటి సినిమాతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బుచ్చిబాబు తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్ తో చేస్తున్నారని అందరూ భావించారు.

ఇకపోతే ఈయన రెండవ సినిమా కూడా మెగా హీరోతో చేయడం విశేషం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు రెండవ సినిమా చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటించబోతుందని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్‌, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై కిలారు వెంకట సతీష్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నారు.

ఇలా పాన్ ఇండియా స్థాయిలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రాబోతుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఇక ఈ సినిమా కోసం ఏకంగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం.ఇలా బుచ్చిబాబు పై నమ్మకంతో నిర్మాణ సంస్థ 300 కోట్లు ఖర్చు చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇందులో ఏ మాత్రం తేడా కొట్టిన భారీగా నష్టపోవాల్సి ఉంటుందని పలువురు ఈ సినిమా విషయంపై చర్చలు జరుపుతున్నారు. ఇక ఈ సినిమా కోసం బుచ్చిబాబు 15 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మేకర్స్ ఆయనకు కొత్త అడ్వాన్స్ చెల్లించాలని ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది.