ఏపీలో “ఆదిపురుష్” డిస్ట్రిబ్యూటర్స్ అలెర్ట్.??

లేటెస్ట్ గా పాన్ ఇండియా మార్కెట్ లో రిలీజ్ కి వచ్చిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా “ఆదిపురుష్” కోసం తెలిసిందే. మరి ఈ భారీ చిత్రంలో ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా దర్శకుడు ఓంరౌత్ అయితే తెరకెక్కించగా ఈ భారీ చిత్రాన్ని మొన్న రిలీజ్ చేయగా దీనిని సెన్సేషనల్ ఓపెనింగ్స్ అయితే వచ్చాయి.

ఇక ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వసూళ్లు ఈ రెండు రోజుల్లో నమోదు కాగా ఈ మూడో రోజు కూడా అదిరే వసూళ్లు అయితే ఈ సినిమాకి రిజిస్టర్ కానున్నాయి. కాగా ఇప్పుడు సినిమా హైక్స్ విషయానికి వస్తే తెలంగాణాలో కేవలం మూడు రోజులు మాత్రమే హైక్స్ ఇవ్వగా ఏపీలో మాత్రం ప్రభుత్వం ఏకంగా 10 రోజులు ఇచ్చారు.

అయితే ఇది ఓ రకంగా మేకర్స్ కి గుడ్ న్యూస్ కానీ లేటెస్ట్ గా ఏపీ డిస్ట్రిబ్యూటర్ మాత్రం కీలక డెసిషన్ తీసుకున్నట్టుగా ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ సమాచారం ప్రకారం అయితే ఏపీలో ఆదిపురుష్ థియేటర్ డిస్ట్రిబ్యూస్టర్స్ అంతా కూడా రేపు ఆదివారం నుంచి టికెట్ ధరలు తగ్గించాలని డిసైడ్ అయ్యారట.

అంతే కాకుండా సింగిల్ స్క్రీన్స్ లో అయితే కేవలం టికెట్ ధర సాధారణ టికెట్ ధరే ప్లస్ 3డి గ్లాస్ ధర మాత్రమే ఉంటుంది అని అంటున్నారు. దీనితో భారీ రేట్స్ కి అయితే వీక్ డేస్ లో థియేటర్స్ కి జనం రారేమో అని అయితే ఇలాంటి డెసిషన్ తీసుకోవడం అలెర్ట్ అయ్యినట్టే అని చెప్పాలి. మరి ఈ సరికొత్త ప్లానింగ్ ఆడియెన్స్ ని అయితే థియేటర్స్ కి రప్పిస్తుందో లేదో చూడాలి.