తన సినిమాని పక్క పెట్టేసిన అనుష్క.?

ఈ రానున్న వారాల్లో టాలీవుడ్ సినిమా నుంచి రిలీజ్ కి రాబోతున్న లేటెస్ట్ చిత్రాల్లో స్టేర్ హీరోయిన్ టాలీవుడ్ ఎవర్ గ్రీన్ స్వీటీ అనుష్క హీరోయిన్ గా నటించిన చిత్రం “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” చిత్రం కూడా ఒకటి. మరి అనుష్క హీరోయిన్ గా యంగ్ హీరో జాతి రత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి నటించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు అయితే తెరకెక్కించాడు.

కాగా ఈ చిత్రం ఇంకా రిలీజ్ కి దగ్గర అవుతుంది. అయితే ఈ సినిమా విషయంలో అనుష్క ఇప్పుడు సైలెంట్ గా ఉండడం సినీ వర్గాల్లో ఆసక్తిగా మారింది. కాగా ఒక్క సోషల్ మీడియాలో సినిమా పోస్ట్ లు మినహా ఈ చిత్రం విషయంలో అనుష్క ఆఫ్ లైన్ లో ఎలాంటి యాక్టీవ్ గా ఉన్నట్టు కనిపించడం లేదు.

దీనితో సినిమా ఆఫ్ లైన్ ప్రమోషన్స్ అన్నీ ఒక్క నవీన్ మాత్రమే చేస్తూ వెళ్తున్నాడు. సరిగ్గా గమనిస్తే చాలా రోజులు నుంచి ఇదే కనిపిస్తుంది. మరి అనుష్క అయితే ఈ ప్రమోషన్స్ విషయంలో కావాలనే పక్కన పెట్టినట్టుగా ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఆమెకి ఉన్న కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ మూలాన ప్రమోషన్స్ కి ఆమె దూరంగా ఉందట. కానీ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి మాత్రం హాజరు అవుతుందని అని సినీ వర్గాల్లో టాక్. మరి అప్పుడైనా ఆమె వస్తుందో లేదో చూడాలి. కాగా ఈ చిత్రం సౌత్ ఇండియా భాషల్లో ఈ ఆగస్ట్ 7న రిలీజ్ కాబోతుంది.