Sridevi Drama Company : ఆ కార్యక్రమంలో ప్రేక్షకులకు క్షమాపణ చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న అన్నపూర్ణమ్మ… ఎందుకంటే?

Sridevi Drama Company : ఒకప్పుడు మంచి మంచి పాత్రలతో వెండితెర మీద ఒక వెలుగు వెలిగిన అన్నపూర్ణమ్మ ప్రస్తుతం బుల్లితెర మీద సందడి చేస్తోంది. ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కామెడీ షోలో అన్నపూర్ణమ్మతో పాటు ఆమెతో కలిసి నటించిన కొందరు సీనియర్ నటులు కూడా ఈ షోలో సందడి చేస్తున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో సీనియర్ నటులను తీసుకువచ్చి వారికి ఉపాధి కల్పిస్తున్నారు. అయితే అందరిని తన పంచులతో నవ్వించే అన్నపూర్ణమ్మ ఇటీవల ఈ షోలో కంటతడి పెట్టుకున్నారు.

ఈవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల అయింది. ఈ ప్రోమోలో సీరియల్ నటి శ్రీవాణి తన కుటుంబంతో కలిసి ఒక అందమైన స్కిట్ చేసింది. ఆ స్కిట్ లో తల్లిదండ్రులు చనిపోగా వారి కూతురు మాత్రమే బ్రతికే ఉంటుంది. అది చూసి ఎమోషనల్ అయిన అన్నపూర్ణమ్మ కు తన కూతురు కూడా గుర్తుకు వచ్చి అందరి ముందు కన్నీరు పెట్టుకుంది. స్కిట్ గురించి సుధీర్ అన్నపూర్ణమ్మని అడుగగా..” ఈ స్కిట్ లో తల్లిదండ్రులు చనిపోయి పాప మాత్రమే ఉంది. కానీ నా జీవితంలో నా కూతురు చనిపోయింది. అందరి ముందు ఆ బాధను వ్యక్తపరచలేము..కానీ ఏ తెల్లవారుజామునో, కంచంలో అన్నం పెట్టుకున్నప్పుడు గుర్తుకొస్తుంది ” అంటూ కంటనీరు పెట్టుకుంది.

అన్నపూర్ణమ్మ అలా కన్నీరు పెట్టుకోవడంతో అక్కడున్న వారందరూ కూడా ఎమోషనల్ అయిపోయారు.అందరి ముందు ఇలా కన్నీరు పెట్టుకున్నందుకు ప్రేక్షకులు నన్ను క్షమించండి అంటూ ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడింది. స్టేజి మీద ప్రేక్షకులను నవ్వించడానికి కామెడీ చేసే అన్నపూర్ణమ్మ నిజ జీవితంలో చాలా దుఃఖం ఉంది. కూతురుని కోల్పోయి ఎంతో బాధను అనుభవిస్తోంది.