బాలీవుడ్ మాఫియాపై “ఆనిమల్” నిర్మాత షాకింగ్ కామెంట్స్..

ఈ ఏడాది ఇండియన్ సినిమా దగ్గర ఉన్న ఆల్ మోస్ట్ అన్ని బిగ్గెస్ట్ గ్రాసర్ చిత్రాల్లో బాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చిన చిత్రాలే అత్యధికంగా ఉన్నాయి. కాగా ఈ చిత్రాల్లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన చిత్రం “ఆనిమల్” కూడా ఒకటి. తాను తెలుగు దర్శకుడు అయినప్పటికీ బాలీవుడ్ సినిమాగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటించాడు.

ఇక ఈ చిత్రం రిలీజ్ అయ్యి బాలీవుడ్ హిస్టరీ లోనే ఒక ఏ సర్టిఫికెట్ తో వచ్చిన బిగ్గెస్ట్ గ్రాసర్ గా ఆల్ టైం రికార్డు సెట్ చేయగా ఈ సినిమా దెబ్బతో నిర్మాతలు కూడా భారీ లాభాలు అందించారు. అయితే ఈ సినిమాకి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంపౌండ్ కూడా నిర్మాణం వహించారు.

తన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ నిర్మాణం వహించారు. అయితే తాము మొదటిగా చేసిన అర్జున్ రెడ్డి కి పొలం అన్ని సినిమా చేస్తే దానికి ఎన్నో ఇంతలు ఎక్కువ డబ్బులు అందుకోగా ఇపుడు ఆనిమల్ తో అయితే దానికి ఎన్నో రెట్లు లాభాలతో ఇక లైఫ్ లో సెటిల్ అయ్యిపోయారు.

అయితే ఇంత వచ్చినప్పటికీ కూడా తాను చేసిన లేటెస్ట్ కామెంట్స్ కొన్ని వైరల్ గా మారాయి. కాగా తాను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలీవుడ్ ఇండస్ట్రీలో కార్పొరేట్ బుకింగ్స్ విషయంలో పెద్ద మాఫియా నడుస్తుంది అని మేము కూడా అది ఫాలో చేసి ఉంటే ఆనిమల్ సినిమా ఈపాటికే 1000 కోట్ల వసూళ్లు అందుకొని ఉండేది అని తాను తెలిపాడు. దీనితో ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.