Anchor Shyamala: నెటిజన్ ప్రశ్నకి అదిరిపోయే రిప్లై ఇచ్చిన యాంకర్ శ్యామల.. నాకది చేయడం ఇష్టం !

Anchor Shyamala: అందం, అభినయంతో పాటు తన యాంకరింగ్‌తో ఇటు బుల్లితెరతో పాటు, వెండితెరపై కూడ తళుకుమంటున్నారు యాంకర్ శ్యామల. బిగ్ బాస్ 2 ద్వారా సెలబ్రిటీగా మారిన ఈమె చిన్న వయసులోనే టీవీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ‘లయ’, ‘అభిషేకం’, ‘గోరింటాకు’, ‘జగదేక వీరుడు అతిలోక సుందరి వంటి సీరియల్స్‌లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆ తర్వాత వెండితెరపై అవకాశాలు అందుకోవడంతో ఆమె క్రేజ్ పెరిగిపోయిందనే చెప్పవచ్చు. శ్యామల తన సహా టీవీ నటుడు నరసింహారెడ్డిని ప్రేమ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

కాగా స్మాల్ స్ర్కీన్‌పై తనదైన శైలితో యాంకరింగ్‌ చేస్తూనే తన అందంతో కట్టిపడేయడం ఆమె సొంతం. అంతే కాకుండా సోషల్ మీడియాలోనూ ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 1 1 మిలియన్ ఫాలోవర్స్ క్రాస్ కాగా, నిత్యం ఏదో ఒక అప్‌డేట్‌తో అభిమానులను అలరిస్తూ సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటున్నారు శ్యామల. 1 మిలియన్ ఫాలోవర్స్‌కు రీచ్ అయిన శ్యామల ఇటీవలే థ్యాంక్యూ ఇన్స్‌స్టాగ్రాం ఫ్యామిలీ అంటూ పోస్ట్ కూడా చేశారు. ఇకపోతే ఒకప్పుడు సీరియల్స్‌తో మంచి ఆదరణను దక్కించుకున్న శ్యామల, ఆ తరువాత ఇతర షోలు, ఎంటర్టైన్మెంట్ షోలు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేస్తూ తన కెరీర్‌లో బిజీ అయిపోయారు.

వంటల షోలతో ఫేమస్ అయిన శ్యామల బిగ్‌బాస్‌ తర్వాత ఏం చెప్పారు శ్యామల గారు అనే యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా కూడా అభిమానులను అలరిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా శ్యామల తన అభిమానులతో ముచ్చట్లు పెట్టేన శ్యామల..అందులో ఒక్కొక్కరు ఒక్కో రకమైన ప్రశ్నను సంధించారు. కొందరు పర్సనల్ విషయాలను టచ్ చేశారు. బెస్ట్ ఫ్యామిలీ పిక్ ఏంటి.. తన కొడుకు ఇషాన్ గురించి ఇలా ప్రశ్నలు సంధించారు. అందులో ఓ నెటిజన్ కాస్త వెరైటీ ప్రశ్నను వేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇషాన్ ఆడుకోవడానికి ఓ చెల్లిని ఇవ్వొచ్చు కదా? అని అడిగేసరికి శ్యామల దానికి అదిరిపోయే రిప్లై ఇచ్చింది. ఓరీ దేవుడా? అంటూ నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేశారు. ఏదేమైనా శ్యామల ఇచ్చిన సమాధానాలు ప్రస్తుతం నెటిజన్లకు బాగా ఆకర్షిస్తున్నాయి.