ఎండలో పరుగులు పెడుతున్న యాంకర్ ప్రశాంతి.. ఈమె కష్టాలు మామూలుగా లేవు?

బుల్లితెర యాంకర్ ప్రశాంతి అంటే చాలామందికి తెలియకపోవచ్చు కానీ గృహలక్ష్మి సీరియల్ నటి లాస్య అంటే మాత్రం టక్కున గుర్తు పడతారు. మొదట యాంకర్ గా తన కెరీర్ ప్రారంభించిన ప్రశాంతి యాంకర్ గా సరైన గుర్తింపు దక్కించుకోలేకపోయింది. తర్వాత బుల్లితెర మీద ప్రసారమవుతున్న గృహలక్ష్మి సీరియల్ లో విలన్ పాత్రలో నటించిన ప్రశాంతి సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. మా టీవీలో ప్రసారమవుతున్న గృహలక్ష్మి సీరియల్ మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. ఈ సీరియల్ లో లాస్య పాత్రలో నటించిన ప్రశాంతి బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది.

ఒకవైపు సీరియల్స్ తో బిజీగా ఉండే ప్రశాంతి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ప్రశాంతి సోషల్ మీడియా ద్వారా తన షూటింగ్ విషయాలను మాత్రమే కాకుండా కోసం విషయాలను కూడా అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. షూటింగ్ సమయంలో అక్కడ జరిగే విషయాల గురించి లైవ్ లో నెటిజన్స్ తో షేర్ చేస్తోంది. గృహలక్ష్మి సీరియల్ లో విలన్ గా నటిస్తున్న లాస్య బయట మాత్రం ఎంతో కూల్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు లైవ్ లోకి వస్తూ అభిమానులు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెబుతూ ఉంటుంది. తాజాగా లాస్య సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోలను చూస్తే లాస్య ఎండలో చాలా కష్టపడుతున్నట్టు కనిపిస్తోంది. లాస్య ప్రస్తుతం గృహలక్ష్మి సీరియల్ షూటింగ్ లో భాగంగా అవుట్ డోర్ షూటింగ్ లో పాల్గొంది. వేసవికాలంలో ఎర్రటి ఎండలో షూటింగ్ చేయటంవల్ల లాస్య చాలా అలసిపోయింది.దీంతో ఏసీ లేదు కదా? అని అంటే.. నువ్ ఉన్నావ్ కదా? అంటూ పక్కనే ఉన్న ఆటోలో కూర్చుంటుంది. ఇక ఈ షూటింగ్ లో లాస్యతో పాటు దివ్య కూడా బాగానే అల్లరి చేసింది. గృహలక్ష్మి సీరియల్ కోసం డైరెక్టర్ లాస్యతో మండుటెండలో పరుగులు పెట్టించాడు. విలన్ గా లాస్య పాత్రలో బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ప్రశాంతి మరొక సీరియల్ లో కూడా విలన్ పాత్రలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇటీవల ప్రసారమవుతున్న దేవతలారా దీవించండి అనే సీరియల్లో కూడా లాస్య విలన్ పాత్రలో నటిస్తోంది.