Anchor Anasuya: అనసూయ ప్రధాన పాత్రలో మరో సినిమా… ఆల్‌ ది బెస్ట్ చెప్పిన అల్లు అరవింద్!

Anchor Anasuya: తన యాంకరింగ్‌తో అలరిస్తూ, ప్రేక్షకులను ఆకట్టుకున్న యాంకర్ అనసూయ దాదాపు చాలా మందికి సుపరిచితమే. జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా టీవీ ప్రేక్షకులకు దగ్గరైన అనసూయ తన అందంతో, కామెడీతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఈ షోకు టీఆర్‌పీ పరంగా కానీ, పాపులారిటీ పరంగా గానీ ఎంతో పేరు తెచ్చుకుంది. దాంతో అందులో చేసే కమెడియన్లకు కూడా చాలా గుర్తింపు వచ్చిన విషయం తెలిసిందే. ఇక అనసూయ విషయానికొస్తే యాంకర్ స్థాయి నుంచీ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పైనా చేసే అవకాశాలను చేజిక్కించుకుంటోంది.

వచ్చిన అవకాశాలను చాలా జాగ్రత్తగా వినియోగించుకున్న అనసూయ, గతేడాది విడుదలై పుష్ప సినిమాలో నెగెటివ్ రోల్ చేసి, ప్రపంచ వ్యాప్తంగా తన రేంజ్‌ను పెంచుకొని, తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. దాంతో ఇప్పుడు నెక్స్ట్ తీయబోయే పుష్ప పార్ 2లోనూ చేసే అవకాశం కొట్టేసిందంటూ ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలా వరుస సినిమాలతో భిన్న పాత్రలతో దూసుకుపోతున్న అనసూయ తాజాగా సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కిన దర్జా అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది.

కాగా ఈ సినిమాలోని రెండో పాటను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. అయితే ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన అల్లు అరవింద్ ఈ పాట చూస్తుంటే సినిమాను చాలా గ్రాండ్‌గా చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో నటించిన నటీనటులందరికీ ఆల్‌ ది బెస్ట్ అంటూ ఉత్సాహం నింపారు. అంతే కాకుండా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి, మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నట్టు అల్లు అరవింద్ అభిప్రాయం వ్యక్తం చేశారు.