Anchor Anasuya: అజ్ఞానంలో ఉన్నారు… కనీసం మానవత్వం కూడా లేదా అంటూ మరోసారి ఫైర్ అయిన అనసూయ?

Anchor Anasuya: ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కూడా ఉక్రెయిన్ పై రష్యా దాడి గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుపుకుంటున్నారు.రష్యా దాడులతో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరిగా మారిపోయి ఎంతోమంది అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది రష్యా ఉక్రెయిన్ పై ఈ దాడులను ఆపి శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవాలని చెబుతున్నప్పటికీ రష్యా మాత్రం తన సైన్యంతో దాడులను కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఘటనపై యాంకర్ అనసూయ స్పందిస్తూ ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా అనసూయ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ…
ఉక్రెయిన్ దేశ పరిస్థితి తలచుకుంటే గుండె పగిలిపోతుంది. వందలాది మంది అమాయకుల ప్రాణాలను కోల్పోతున్నారు ఓ సినిమా షూటింగ్ నిమిత్తం 2015లో ఉక్రెయిన్ వెళ్లాను. అక్కడి ప్రజలు ఆదేశాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు. తాను తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి అక్కడి అందాలను చూడాలని తన ప్రణాళికలో ఉందని అయితే పరిస్థితి ప్రస్తుతం ఇలా మారడం ఎంతో దురదృష్టకరమని అనసూయ ట్విట్టర్ ద్వారా ఉక్రెయిన్ పై జరుగుతున్న దాడులు గురించి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఈ విధంగా అనసూయ చేసిన ఈ వ్యాఖ్యలను ఓ నెటిజన్ తీవ్రంగా ఖండించారు. భారత్ కి వ్యతిరేకంగా పాకిస్తాన్ కు ఓటు వేసిన ఉక్రెయిన్ దేశం పై అంతగా జాలి పడాల్సిన అవసరం లేదని నెటిజన్ కామెంట్ చేయడంతో అనసూయ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.కేవలం రాజకీయ నాయకులు తన రాజకీయాల కోసం తీసుకున్న ఇలాంటి స్వార్థపూ నిర్ణయాల వల్ల ఎంతోమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.ఇది చాలా అన్యాయం నీలాంటి వాళ్ళు ఇంకా అజ్ఞానం లోనే ఉన్నారు కొంచెం కూడా మానవత్వం లేదా అంటూ అనసూయ తనదైన స్టైల్ లో ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.