అనసూయ ఏం మాట్లాడుతున్నావు .. వామ్మో .. ఎందుకలా ఏమైందసలు ?

అనసూయ జబర్దస్త్ యాంకర్ .. సినిమాలలో కొత్త తరహా పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది. కొన్ని పాత్రలకి అనసూయ మాత్రమే సూటవుతుందని దర్శకులు గట్టిగా నమ్మేంతగా ఇచ్చిన పాత్రకి న్యాయం చేస్తూ తన ఇమేజ్ ని పెంచుకుంది. క్షణం, రంగస్థలం సినిమాలలో తన పాత్రలు అందుకు ఉదాహరణ. ఒకవైపు యాంకర్ గా మరొక వైపు నటిగా విభిన్నమైన పాత్రలు చేస్తూనే అప్పుడప్పుడు ఐటెం సాంగ్స్ లో కూడా చిందులేసి మెప్పిస్తోంది. ఇప్పటికే విన్నర్, ఎఫ్ 2 లాంటి సినిమాలలో అనసూయ నర్తించిన ఐటెం సాంగ్స్ కి మంచి పేరొచ్చింది.

ఈ క్రమంలోనే మరోకసారి ఐటెం సాంగ్ చేసేందుకు రెడీ అవుతోంది.చావు కబురు చల్లగా అనే సినిమాలో అనసూయ ఒక ఐటెం సాంగ్ తో అదరగొట్టబోతుందని చెప్పుకుంటున్నారు. కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 బ్యానర్ పై బన్నీ వాసు – వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో ఉన్న ఐటెం సాంగ్ సినిమాకి బాగా ప్లస్ అవుతుందట. ఆ సాంగ్ అనసూయ తో చేయించారు మేకర్స్. ఇక ఈ సాంగ్ లో అనసూయ చక్కగా చీరలో కనిపించబోతుండటం విశేషం.

‘అవసరమని వేడుకుంటారు.. అవసరానికి వాడుకుంటారు.. అవసరం తీరాక ఆడుకుంటారు’ అన్న సాంగ్ లో అనసూయ నర్తించింది. ఇక సినిమా షూటింగ్ కోసం చిత్ర యూనిట్ ప్రత్యేకంగా వేసిన సెట్టింగ్ లో పాట చిత్రీకరణ జరుపుతున్నారు. సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ కావచ్చిందట. కాగా ఈ సినిమాను మార్చి 19న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. మరి కార్తికేయ కి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుందో చూడాలి. ఇక అనసూయ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగ మార్తాండ సినిమాలో అనసూయ కీలక పాత్ర పోషిస్తోంది.