RRR : అనసూయ లూప్ లో వింటున్న పాట ఏంటో తెలుసా…. ఆ పాట చాలా నచ్చిందంటూ ట్వీట్ చేసిన అనసూయ….!

RRR : ఆర్ఆర్ఆర్ లో పాటలన్నీ ప్రేక్షకులకు బాగా నచ్చాయి. ముఖ్యంగా సినిమా విడుదలకు ముందు అందరికి నాటు నాటు పాట బాగా ఆకట్టుకుంది. అయితే చివర్లో విడుదల చేసిన ఎత్తర జెండా కూడా విశేషంగా ఆకట్టుకుంది.ఇక దోస్తీ జనని పాటలు కూడా జనాలను ఆకట్టుకున్నాయి. ఇక కొమ్మ ఉయ్యాలా సాంగ్ సినిమా చూసాక బాగా కనెక్ట్ అయ్యారు. ఇక కొమరం భీముడో సాంగ్ ను సినిమా విడుదలకు ముందు కంటే కూడా సినిమా చూసాక బాగా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. జక్కన్న చాలా తెలివిగా ఈ పాట వీడియోను విడుదల చేయకుండా సినిమాలోనే పాటను చూపించారు.

ఈ పాటకు ఎన్టీఆర్ అభినయం, కాలభైరవ గాత్రం ప్రేక్షకులను సినిమాలో కంటతడి పెట్టించింది. ఇక జక్కన్న కు కూడా సినిమాలో బెస్ట్ ఎపిసోడ్ కొమరం భీముడో పాట అని చెప్పడంతోనే చెప్పొచ్చు ఆ పాట ఎంతగా అందరిని మనసుకు హత్తుకుందో. ఆ పాట కోసం మళ్ళీ సినిమాకు వెళ్లినవాళ్లు లేకపోలేదు. ఇక సినిమా లో ఎన్టీఆర్ సరసన నటించినా ఇంగ్లీష్ భామ ఓలివియా కూడా ఈ పాటలో ఎన్టీఆర్ నటనకు కన్నీరు పెట్టుకున్నానని చెప్పారు.

ఇక ఎన్టీఆర్ కెరీర్ లోనే మంచి నటన గా ఈ పాటలోని అభినయం మిగిలిపోతుంది. అలాంటి ఈ పాట ఇపుడు జబర్దస్త్ ముద్దుగుమ్మకు తెగ నచ్చిందంట. పదే పదే అదే పాటను వింటున్నా అంటూ సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టి మరీ అభిమానులకు చెప్పింది అనసూయ. ఆర్ఆర్ఆర్ కు సంగీతం కీరవాణి గారు అందించారు. ఆయన ఈ మధ్యనే సినిమాలోని బిజీఎం మరియు కొమ్మ ఉయ్యాలా. పాటల గురించి మాట్లాడుతూ కొమ్మ ఉయ్యాలా. పూర్తి పేటను విడుదల చేస్తామని చెప్పారు.