టీ సీరీస్ రెమ్యునేషన్స్.. అస్సలు తగ్గట్లేదుగా

టాలీవుడ్ హీరోలతో మరిన్ని సినిమాలు నిర్మించేందుకు టి-సిరీస్ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఈ సంస్థ ఇప్పటికే తెలుగు హీరోలతో పలు చిత్రాలను నిర్మించగా, ప్రస్తుతం తానాజీ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న “ఆదిపురుష్” చిత్రాన్ని రూపొందిస్తోంది. ఈ సినిమాలో నటించేందుకు ప్రభాస్ 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అల్లు అర్జున్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో టి-సిరీస్ కొత్త ప్రాజెక్ట్‌ను కూడా ప్రకటించింది. ఈ చిత్రానికి అల్లు అర్జున్ 120 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. సందీప్ రెడ్డి వంగా కూడా ప్రభాస్ ప్రధాన పాత్రలో “స్పిరిట్” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు, దీనిని కూడా టి-సిరీస్, సందీప్ రెడ్డి వంగా స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కూడా ప్రభాస్ తన పాత్ర కోసం దాదాపు 120 కోట్లు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ప్రభాస్ అలాగే అల్లు అర్జున్ ఇద్దరూ తమ తమ సినిమాలకు 120 కోట్లు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ దర్శకత్వం వహించిన “పుష్ప” మొదటి పార్ట్ కోసం అల్లు అర్జున్ 70 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక రెండవ భాగానికి 100 కోట్ల వరకు వసూలు చేసినట్లు ఊహాగానాలు .

ఇక “పుష్ప” భారీ విజయాన్ని సాధించింది, కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీ బెల్ట్ మరియు ఓవర్సీస్‌లో కూడా ప్రపంచ వ్యాప్తంగా రూ. 360 కోట్లు వచ్చాయి. అంచనాలు తక్కువగా ఉన్నప్పటికీ, ఈ చిత్రం అందరి అంచనాలను మించిపోయింది. ఇక ఇప్పుడు సీక్వెల్‌ను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.

“పుష్ప 2″కి మొదట్లో బడ్జెట్ తక్కువే కానీ ఇప్పుడు 350 కోట్లకు పెంచారనే ప్రచారం జరుగుతోంది. ముందుగా అనుకున్న స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. అంతేకాదు “పుష్ప 2”కి కేటాయించిన బడ్జెట్‌లో అరవై శాతానికి పైగా హీరో, దర్శకుల రెమ్యూనరేషన్‌కే ఖర్చు అవుతున్నట్లు టాక్.