ఉప్పెన సినిమా చూస్తూ కంటతడి పెట్టుకున్న బన్నీ!

టాలీవుడ్ లో ఇటీవలే విడుదలై విజయాన్నందుకున్న చిత్రం ఉప్పెన. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి నటించిన ఉప్పెన చిత్రానికి విమర్శకుల నుంచి కూడా మంచి మార్కులు పడ్డాయి. కాగా, టాలీవుడ్ అగ్రహీరో అల్లు అర్జున్ ఉప్పెన చిత్రాన్ని నిన్న వీక్షించారు. సినిమా చాలా బాగుందంటూ చిత్రబృందాన్ని అభినందించారు. దర్శకుడ్ని, హీరోని ప్రత్యేకంగా ప్రశంసించారు. చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా, హీరో వైష్ణవ్ తేజ్, నిర్మాతలు బన్నీని కలిసినప్పటి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కోసం మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు స్పెషల్‌ షోను వేసారు. ఈ సినిమాను చూసి అల్లు అర్జున్ భావోద్వేగానికి గురయ్యారు. కొన్ని సన్నివేశాల్లో బన్ని కంటతడి పెట్టుకున్నట్టు సమాచారం. (Twitter/Photo)

ఇదిలా ఉంటే షూటింగ్ బిజీలో ఉన్న బన్నీ ఈ సినిమాను ఇప్పటివరకు చూడలేకపోయారు. ఐతే , తాజాగా తమిళనాడు షెడ్యూల్ పూర్తి కావడంతో హైదరాబాద్ వచ్చిన అల్లు అర్జున్‌కు పుష్ప నిర్మాతలు రామానాయుడు స్టూడియోస్‌లో స్పెషల్ షో వేశారు. ఈ సినిమాను చూసి అల్లు అర్జున్ భావోద్వేగానికి గురయ్యారు. కొన్ని సన్నివేశాల్లో బన్ని కంటతడి పెట్టుకున్నట్టు సమాచారం షూటింగ్ బ్రేక్‌లో ఈ సినిమా చూసిన అల్లు అర్జున్.. చిత్ర యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు మెచ్చుకున్నారు. ముఖ్యంగా హీరో వైష్ణవ్ తేజ్ పర్ఫార్మెన్స్ గురించి ప్రశంసించారు. తొలి సినిమాతోనే అద్భుతమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు అని పొగిడారు.

వైష్ణ‌వ్‌కు అద్భుతమైన డెబ్యూ దొరికింది అని తెలిపారు అల్లు అర్జున్. అలాగే హీరోయిన్ కృతి శెట్టి.. విజయ్ సేతుపతి నటన గురించి ప్రశంసించారు. ఒక సున్నితమైన పాయింట్ తీసుకొని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు బుచ్చిబాబు పనితీరు గురించి ప్రత్యేకంగా ప్రశంసించారు అల్లు అర్జున్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థను పొగడ్తల్లో ముంచెత్తారు బన్నీ. ఏ నిర్మాత అయినా రిస్క్ లేని కథలు చేయాలనుకుంటారు. కానీ రిస్కు ఉంది అని తెలిసినా కూడా కథను నమ్మి మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఉప్పెన సినిమా.. కథలపై వాళ్లకున్న నమ్మకాన్ని, ధైర్యాన్ని తెలియజేస్తుందన్నారు అల్లు అర్జున్.