Akshay kumar : బచపన్ పాండేకి ఆర్ఆర్ఆర్ సినిమా భయం పట్టుకుందా.. అక్షయ్ ఏమంటున్నారు?

 

Akshay Kumar: టాలీవుడ్ అగ్ర కథానాయకుల లో అక్షయ్ కుమార్ కూడా ఒకరు. అక్షయ్ కుమార్ నటించిన బస్సు పాండే సినిమా ను మార్చి 18న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్ణయించుకున్నారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ సరసన కృతి సనన్, జాక్వలిన్ ఫెర్నాండెజ్ తదితరులు నటించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లలో అక్షయ్ కుమార్ బిజీగా ఉన్నారు. ప్రమోషన్లలో భాగంగా అక్షయ్ కుమార్ ఇంటర్వ్యూ లో పాల్గొంటున్నారు.

ఈ క్రమంలోనే అక్షయ్కుమార్ ఒక ఇంటర్వ్యూలో ఆర్.ఆర్ ఆర్ సినిమా గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా మార్చి 25న విడుదల అవుతుండటంతో, బచ్పన్ పాండేకు ఆర్ ఆర్ ఆర్ సినిమాకు మధ్య గట్టి పోటీ ఉంటుందని అక్షయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా కచ్చితంగా బచపన్ పాండే సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల మీద ప్రభావం చూపుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రతి సినిమా ఇంకొక సినిమా మీద ప్రభావం చూపుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కోవిడ్ కారణంగా చాలా సినిమాలు విడుదల ఆలస్యం అయిందని, ఇప్పుడు అన్ని సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయని, దీని కారణంగా ఒక సినిమా ప్రభావం ఇంకొక సినిమా మీద కచ్చితంగా ఉంటుందని ఆయన ఆయన అన్నారు. ఆర్.ఆర్ ఆర్ వలన బచపన్ పాండే బాక్సాఫీస్ కలెక్షన్లు 30 నుంచి 40 శాతం వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. విడుదల తర్వాత ఏ సినిమాలు ఎంత ప్రేక్షకులను అలరిస్తాయి అనేది వేచి చూడాలి.