Akshay Kumar: క్షమించమని అభిమానులను వేడుకున్న అక్షయ్ కుమార్.. ఇకపై తప్పు జరగదు!

Akshay Kumar:బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో పేరు సంపాదించుకున్న అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించడమే కాకుండా పలు కమర్షియల్ యాడ్స్ ద్వారా కూడా భారీ మొత్తంలో సంపాదిస్తున్నారు.ఇలా సినిమాలు యాడ్స్ చేస్తూ ఎంతో బిజీగా ఉన్న అక్షయ్ కుమార్ తాజాగా బాలీవుడ్ హీరోలు అజయ్‌దేవ్‌గణ్‌, షారుఖ్‌ఖాన్‌లతో కలిసి ఓ పొగాకు బ్రాండ్‌ వాణిజ్య ప్రకటనలో నటించారు. ఈ క్రమంలోనే ఈ యాడ్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి యాడ్స్ లో నటిస్తూ యువతను తప్పుదోవ పట్టించడం ఏంటి అంటూ పెద్ద ఎత్తున అభిమానులు ఈ యాడ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అభిమానులు చూపిస్తున్న వ్యతిరేకత పై అక్షయ్ కుమార్ స్పందించి నోరు మెదపారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా అభిమానులకు బహిరంగంగా క్షమాపణలు చెబుతూ ఇకపై ఇలాంటి తప్పుడు జరగదని మాట ఇచ్చారు.

నన్ను ఎంతగానో ఆదరించి అభిమానిస్తున్న శ్రేయోభిలాషులకు నా క్షమాపణలు. గత కొన్ని రోజుల నుంచి మీ నుంచి వస్తున్న వ్యతిరేకత నన్ను ఎంతగానో కలిచివేసింది. నేను ఇప్పటికీ పొగాకుకు వ్యతిరేకినే, మీ అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకొని నేను ఈ యాడ్ నుంచి తప్పుకుంటున్నాను. ఇకపై ఇలాంటి కమర్షియల్ యాడ్స్ లో తాను నటించనని అయితేకాంట్రాక్టు ఉన్న కారణంగా న్యాయపరమైన ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ యాడ్ ప్రసారమవుతుందని ఈ సందర్భంగా అభిమానులకు అక్షయ్ కుమార్ బహిరంగంగా క్షమాపణలు చెబుతూ తన గురించి వస్తున్న వ్యతిరేకత పై స్పందించి క్లారిటీ ఇచ్చారు.