ఒక్క పాట కోసం 25 రోజులు కష్టపడిన ఐశ్వర్య.. జక్కన్నను మించిపోయిన మణిరత్నం?

టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటాయో మనకు తెలిసిందే. అయితే సినిమా అంటే తప్పనిసరిగా రెండు మూడు సంవత్సరాలు పాటు జక్కన్న చేతిలో బ్లాక్ అవ్వాల్సిందే.ఇక ప్రతి ఒక్క విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఎంతో అద్భుతంగా సినిమాని తెరకెక్కించే ఘనత రాజమౌళికి ఉంది. అయితే ఈయన బాటలోనే మరోదర్శకుడు మణిరత్నం సైతం ఇతనిని ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది.

మణిరత్నం సినిమాలకు కూడా ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ ఉంది. ఈయన దర్శకత్వంలో చేయాలని ఎంతో మంది నటీనటులు ఆరాటపడుతుంటారు. తాజాగా ‘పొన్నియన్ సెల్వన్‌’ అనే హిస్టారికల్ ఫిక్షన్ నావెల్‌ను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాని సెప్టెంబర్ 30వ తేదీ విడుదల చేయడానికి పెద్ద ఎత్తున సన్నాహాలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే ఒక పాట కోసం మణిరత్నం ఏకంగా 300 మంది డాన్సర్లను రంగంలోకి దింపి ఈ పాటను చిత్రీకరించారట.

ఇకపోతే ఈ పాట కోసం మణిరత్నం ఏకంగా 300 మంది డాన్సర్లతో 25 రోజులపాటు రిహారసల్స్ చేయించారట. ఇందులో ఐశ్వర్యరాయ్ తో పాటు త్రిష కూడా సందడి చేస్తున్నట్లు సమాచారం. ఈ పాట కోసం వీరిద్దరూ కూడా 25 రోజులు కష్టపడినట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఈ క్రమంలోనే కొందరు ఈ విషయంపై స్పందిస్తూ మణిరత్నం కూడా జక్కన్నకు ఏమాత్రం తగ్గడం లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.