మరోసారి “ఇస్మార్ట్” కాంబో..కానీ.!

అప్పటి వరకు టాలీవుడ్ దగ్గర వరుస ప్లాప్ లు డిజాస్టర్స్ లో ఉన్న ఇద్దరు దర్శక హీరో లు ఓ సినిమాతో తమ ఫేట్ ని మార్చేసుకున్నారు. దీనితో దెబ్బకి ఆ హీరో మార్కెట్ అలాగే దర్శకుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ గా పాన్ ఇండియా లెవెల్లో భారీ ఆఫర్స్ వచ్చేశాయ్. మరి ఆ హీరోనే ఉస్తాద్ రామ్ పోతినేని కాగా ఆ దర్శకుడు పూరి జగన్నాథ్.

అయితే వీరి కాంబోలో వచ్చిన మొదటి సినిమా “ఇస్మార్ట్ శంకర్” భారీ లాభాలు అందించి ఒక్కసారిగా ఇద్దరి గ్రాఫ్ ని భారీ లెవెల్లో పెంచేసింది. ముఖ్యంగా రామ్ కి మాస్ ఆడియెన్స్ లో మంచి ఫాలోయింగ్ ని తెచ్చిన ఈ సినిమా పూరి జగన్నాథ్ ని కూడా మళ్ళీ ట్రాక్ లో పడేసింది.

అయితే తర్వాత పూరి చేసిన లైగర్ భారీ ప్లాప్ కావడంతో మరో సినిమా తనకి చేసే ఛాన్స్ రాలేదు. కానీ ఫైనల్ గా మళ్ళీ రామ్ నే పూరికి అవకాశం ఇచ్చినట్టుగా సినీ వర్గాలు కోడై కూస్తున్నాయి. కానీ వీరి నుంచి ఏ సినిమా ఉంటుంది అనేది ప్రశ్నగా మారింది.

పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ తో అనౌన్స్ చేసిన “జనగణమన” నా లేక ఇస్మార్ట్ శంకర్ పార్ట్ 2 “డబుల్ ఇస్మార్ట్ శంకర్” సినిమానా అనేది ఇంకా ఖరారు కాలేదట. దీనితో ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఏ సినిమా వస్తుంది అనేది ఇపుడు సినీ వర్గాల్లో చర్చగా మారింది. అయితే అభిమానులు మాత్రం ఇస్మార్ట్ శంకర్ 2 కోసం బాగా ఎగ్జైట్ అవుతున్నారు.