సందీప్ ఉన్నికృష్ణన్ కు అడవి శేష్ ఘన నివాళి.. ఫొటోస్ వైరల్?

26 /11 ముంబై లోని తాజ్ హోటల్ లో ఉగ్రవాదులు జరిపిన దాడులలలో ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి తన ప్రాణాలను వదిలిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ మనందరికీ తెలిసిందే. ఆరోజున భారత సైనికులు వారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఉగ్రవాదులతో ధైర్యంగా పోరాడి దేశ విదేశ అమాయక ప్రజలను కాపాడారు. ఆరోజుని భారత దేశ ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరు. నవంబర్ 26న భారతదేశంలోని ప్రజలు మరిచిపోలేని ఒక చీకటి రోజు అని చెప్పవచ్చు. కాగా ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఒక సినిమాను కూడా తెరకెక్కించిన విషయం తెలిసిందే. డైరెక్టర్ శశి దర్శకత్వంలో అడవి శేష్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మేజర్.

ఈ సినిమాలో ఉన్ని కృష్ణన్ గా అడవి శేష్ నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదలకి ముందు జనాల్లో ఎలాంటి అంచనాలను అయితే సెట్ చేసిందో ఆ అంచనాలకు మించే ఈ సినిమా హిట్ గా నిలిచింది. ఉన్ని కృష్ణన్ గా అడవి శేష్ నటన ప్రేక్షకుల చేత కంటతడి పెట్టేలా చేసింది. మరి ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో ఆయన చూపించిన నటన కెరీర్ బెస్ట్ అని చెప్పొచ్చు.

ఇక ఇది ఇలా ఉంటే తాజాగా టాలీవుడ్ హీరో అడవి శేష్ ముంబై కి వెళ్లి అక్కడ 26/11 వీర సైనికుల స్మారక చిహ్నాన్ని స్మరించుకొని వారికి ఘన నివాలి అర్పించారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులతో కలిసి తల్లిదండ్రులకు ఘన నివాళి అర్పించారు అడవి శేష్. కాగా ఎందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలలో అడవి శేష్ తో పాటుగా సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులు కూడా ఉన్నారు.