Adavallu Meeku Joharlu: ప్రీ రిలీజ్ వేడుకకు అతిథులుగా ఆ ఇద్దరు హీరోయిన్స్ తో పాటు…. స్టార్ డైరెక్టర్ అధికారికంగా ప్రకటించిన మేకర్స్!

Adavallu Meeku Joharlu: తిరుమల కిషోర్ దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ సినిమాలో శర్వానంద్ రష్మిక మందన హీరో హీరోయిన్లుగా నటించారు. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 25వ తేదీ విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల మార్చి నాలుగో తేదీకి వాయిదా పడింది. ఈ క్రమంలోనే మార్చి 4వ తేదీ ప్రసారం కాబోయే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను 27వ తేదీ నిర్వహించనున్నారు.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా ఆడవాళ్ళ గొప్పతనం గురించి తెలియజేస్తూ ఉండడంతో ఈ సినిమా రిలీజ్ వేడుక కోసం ఇద్దరు స్టార్ హీరోయిన్లను అతిథులుగా ఆహ్వానించారు.ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సాయి పల్లవి కీర్తి సురేష్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని వార్తలు వచ్చాయి అయితే ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా వెల్లడించారు.

సాయి పల్లవి,కీర్తి సురేష్ తో పాటు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమాలో సీనియర్ నటీమణులు రాధిక శరత్ కుమార్, ఖుష్బూ, నటి ఊర్వశి ముఖ్య పాత్రలో ప్రేక్షకులను సందడి చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు పోస్టర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.