Sharwanand : ఆడవాళ్లు మీకు జోహార్లు ఓటిటి తేదిని ఫిక్స్ చేసారు..

Sharwanand: ఆడవాళ్లు మీకు జోహార్లు ఓటిటి తేదీని ఖరారు చేసారు దర్శక నిర్మాతలు.ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా మార్చి 4న థియేటర్లలో విడుదల అయి ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాను తిరుమల కిషోర్ దర్శకత్వం వహించారు. శర్వా సరసన రష్మికమందన హీరోయిన్ గా నటించింది. ఖుష్బు, రాధికా శరత్ కుమార్ తదితరులు నటించారు

ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా కుటుంబ కథగా, ఎమోషనల్ డ్రామా గా తెరకెక్కింది. కుటుంబ ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక ఈ సినిమా ను మరింత ప్రేక్షకులకు దగ్గర చేసేందుకు ఓటిటి లో విడుదల చేసేందుకు సన్నద్ధమయ్యారు చిత్ర యూనిట్. సోనీ లైవ్ ప్లాట్ ఫారం ద్వార ఓటిటి లో విడుదల చేయబోతున్నారు.

ఏప్రిల్ మొదటి వారంలో ఓటిటి విడుదలకు సిద్ధమైంది. సినిమాను త్వరగా ఓటిటి లో విడుదల చేయడానికి పెద్ద కారణాలే ఉన్నాయట. రాధే శ్యామ్, ఆర్ ఆర్ ఆర్ లాంటి పెద్ద సినిమాలు మార్చి లో విడుదల అవబోతుండడంతో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా కు కష్టాలు మొదలయ్యాయి. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా పెద్ద సినిమాలతో పోటీపడి థియేటర్స్ లో నిలబడటం అసాధ్యం.
అందుకే దర్శక నిర్మాతలు సినిమా ను ఓటిటి లో త్వరగా రిలీజ్ చేయబోతున్నారు. ఏప్రిల్ మొదటి వారం లో సినిమా అందుబాటులోకి రానుంది. అయితే ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే సినిమా ఓటిటి తేదిని ప్రకటించనున్నారు.