“యాత్ర 2” కి షాక్ తగిలిందిగా.!

రీసెంట్ గా అయితే ఇండియన్ సినిమా దగ్గర బయో పిక్ చిత్రాలు బాగా తగ్గాయి. అయితే ఈ చిత్రాలు ఇప్పుడు పొలిటికల్ గా అయితే కొన్ని సినిమాలు మైలేజీ పెంచుకోడానికి మాత్రమే చేస్తున్నట్టుగా అర్ధం అవుతుంది. గత ఎన్నికల సమయంలో మన టాలీవుడ్ లోనే, ఎన్టీఆర్ జీవిత చరిత్రపై అలాగే వై ఎస్సార్ జీవిత చరిత్రలపై సినిమాలు తీసి మేకర్స్ సరిగ్గా ఎన్నికల ముందే రిలీజ్ చేశారు.

అయితే ప్రేక్షకులు ఆదరణ పక్కన పెడితే మళ్ళీ తెలుగులో అయితే సరికొత్త పొలిటికల్ సినిమా రాబోతుంది అదే “యాత్ర 2”. గత ఎన్నికల సమయంలో వచ్చిన యాత్ర కి ఇది సీక్వెల్ కాగా ఈ చిత్రంలో ఎక్కువ వై ఎస్ జగన్ పై భాగం ఉండనుంది. అయితే ఈ సినిమా యూనిట్ కి ఇపుడు షాక్ తగిలిందని చెప్పాలి.

ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడు పోస్టర్ లాంటివి అన్ని మేకర్స్ నిజానికి ఈ జూలై 8న దివగంత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా అనౌన్స్ చేద్దాం అనుకున్నారు. కానీ అనూహ్యంగా వారం ముందే ఈ సినిమా పోస్టర్ బయటకి లీక్ అయ్యిపోయింది. అయితే ఇది మేకర్స్ కి తెలియకుండా లీక్ అయ్యినట్టుగా తెలుస్తుంది.

దీనితో ఆ ప్రత్యేక రోజున ప్లాన్ చేసుకున్న అప్డేట్ ముందే లీక్ అవ్వడం ఒకింత షాక్ గా మారగా పోస్టర్ స్ప్రెడ్ అవ్వడంతో అయితే మేకర్స్ దానినే కంటిన్యూ చేసేసారు. దీనితో అయితే వై ఎస్ ఆర్ చేతిలో జగన్ నీడ ఉన్నట్టుగా హైలైట్ చేస్తూ సినిమాని 2024 ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు. సరిగ్గా ఎన్నికల ముందు ఇది వస్తుంది అని చెప్పాలి. ఇక ఈ అప్డేట్ కి అయితే ఇప్పుడు మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది.