ఇండస్ట్రీ టాక్ : మహేష్ – రాజమౌళి ప్రాజెక్ట్ పై క్రేజీ అప్డేట్ 

టాలీవుడ్ సహా ఇండియన్ సినిమా నుంచి కూడా రానున్న పలు మోస్ట్ అవైటెడ్ భారీ చిత్రాల్లో ఇండియాస్ టాప్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి నెక్స్ట్ చిత్రం కూడా ఒకటి అని చెప్పాలి. కాగా ఎస్ ఎస్ రాజమౌళి మొట్ట మొదటి సారిగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న సినిమా ఇదే కావడంతో దీనిపై హైప్ మామూలుగా లేదు.

అలాగే మహేష్ బాబు కెరీర్ లో 29వ సినిమాగా ఇది తెరకెక్కుతుంది. ఇంకా ఈ సినిమాపై అధికారిక అనౌన్సమెంట్ ఏదన్నా ప్రొడక్షన్ రాలేదు కానీ ఈ సినిమాపై మాత్రం ఇప్పుడు సెన్సేషనల్ బజ్ బయటకి వచ్చింది. ప్రస్తుతం దర్శకుడు రాజమౌళి సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని స్టార్ట్ చేసారని.. 

కాగా ఇప్పుడు హైదరాబాద్ లోనే మేకర్స్ ఓ మాసివ్ సెట్ వర్క్ ని ఇప్పుడు చేస్తున్నారట. అలాగే సెట్ లో ఓ క్రేజీ ఏక్షన్ బిట్ ని జక్కన్న చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో హిందీ సహా ఇంగ్లీష్ నుంచి కూడా అనేకమంది నటీనటులు నటిస్తారని తెలుస్తుంది.

మొత్తానికి అయితే గట్టి ప్లానింగ్ లతోనే సినిమాని ఊహించని లెవెల్లో ప్లాన్ చేస్తున్నారని చెప్పాలి. ఇపుడు మహేష్ గుంటూరు కారం సినిమా తర్వాత ఫ్రీ అయిపోతాడు. తర్వాత కొన్ని రోజుల ట్రైనింగ్ అనంతరం రాజమౌళి ప్రాజెక్ట్ లో తాను జాయిన్ కానున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్ధంలో షూటింగ్ స్టార్ట్ చేసుకుంటున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.