బాలకృష్ణ – చిరంజీవి ఫ్యాన్స్ కి ఒకేసారి బ్యాడ్ న్యూస్ చెప్పిన పూరీ జగన్నాథ్ ..

బాలకృష్ణ – చిరంజీవి నటిస్తున్న సినిమాలు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బిబి3 అన్న హ్యాట్రిక్ సినిమా చేస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. మోనార్క్ అన్న టైటిల్ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. గతంలో బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సింహ, లెజెండ్ సినిమాలు వచ్చి సూపర్ హిట్ గా నిలిచాయి. దాంతో ఇప్పుడు తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా మీద భారీగా అంచనాలున్నాయి.

ఇక చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ – మ్యాట్నీ ఎంటర్‌టైనమెంట్స్ బ్యానర్స్ పై రాం చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో లూసీఫర్ రీమేక్ లో నటించబోతున్నారు. అలాగే తమిళ హిట్ సినిమా వేదాళం రీమేక్ లో కూడా నటించబోతుండగా మెహర్ రమేష్ ఈ సినిమాకి దర్శకుడు.

అయితే లాక్ డౌన్ పూరి జగన్నాధ్ కొన్ని కథలు రాశాడన్న విషయం తెలిసిందే. ఆకథలు సీనియర్ హీరోల తో పాటు యంగ్ హీరోల తో కూడా తీసే అవకాశం ఉందట. ఈ క్రమంలో పూరి జగన్నాధ్ నెక్స్ట్ సినిమా బాలకృష్ణ లేదా చిరంజీవి తో ఉంటుందని భావించారు. ఇప్పటికే చిరంజీవి తో పూరి జగన్నాధ్ సినిమా చేయాల్సి ఉండగా క్యాన్సిల్ అయింది. ఇక బాలకృష్ణ తో పైసా వసూల్ చేసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూరి జగన్నాధ్ నెక్స్ట్ సినిమా బాలకృష్ణ – చిరంజీవి తో కాకుండా నాగార్జున చేయబోతున్నట్టు సమాచారం. త్వరలో ఇందుకు సంబంధించిన అఫీషియల్ న్యుస్ రానుందని అంటున్నారు.